స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలి

ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి

తిరుపతి : ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని ఆ సంస్థ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి స్ప‌ష్టం చేశారు. తిరుపతిలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో సీఎండీ శివశంకర్ లోతేటి ఆ సంస్థ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సంస్థ పరిధిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ విద్యుత్ సర్వీసులతోపాటు కొన్ని ఇతర కేటగిరీల సర్వీసులకు కూడా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేశామని వివరించారు. స్మార్ట్ మీటర్ల పనులను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.

ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) విభాగం ద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని సీఎండి శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. విద్యుత్ బిల్లింగ్ ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించడం తోపాటు ఆన్లైన్ చెల్లింపులను సరళతరం చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ బిల్లుల ఆన్లైన్ చెల్లింపులు 100 శాతానికి చేరేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని వివరించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే సందర్భంలో సమాచారాన్ని వినియోగదారులకు ముందుగానే తెలియ జేసేందుకు వీలుగా ‘విద్యుత్ మిత్ర’ యాప్ ను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు సీఎండీ.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *