ఆక‌స్మిక త‌నిఖీ చేసిన ఈవో సింఘాల్

Spread the love

ప‌లు శాఖ‌ల‌ను ప‌రిశీలించిన అనిల్ కుమార్

తిరుప‌తి : టీటీడీ నూత‌న ఈవోగా కొలువు తీరిన అనిల్ కుమార్ సింఘాల్ దూకుడు పెంచారు. గురువారం ఆయ‌న ఆక‌స్మికంగా త‌నిఖీలు చేప‌ట్టారు. తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సందర్శించారు. మొదటగా అకౌంట్స్, అన్నదానం, బోర్డు సెల్, ఐ.టి, సోషల్ మీడియా, ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, ప్రజా సంబంధాల కార్యాలయం, ఎస్టేట్ కార్యాలయాలను త‌నిఖీ చేశారు. సదరు అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా టిటిడి ఈవోకు అధికారులు, సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఉద్యోగులు నూతన సాంకేతికతను మరింతగా అందిపుచ్చుకుని వేగవంతంగా సేవలు అందించాలని సూచించారు.

అంతకు ముందు ఈవో ఛాంబర్ లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం, శ్రీ కోదండరామ స్వామి ఆలయం, శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం నుండి వచ్చిన వేద పండితులు శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ కు వేదాశీర్వచనం చేశారు. ముందుగా టిటిడి పరిపాలనా భవనానికి టిటిడి ఈవో చేరుకోగానే, పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, సిబ్బంది స్వాగతం పలికారు. టిటిడి ఈవో వెంట ఎఫ్ఏ అండ్ సిఏవో ఓ. బాలాజీ, అదనపు ఎఫ్ఏసిఏవో రవిప్రసాద్, చీఫ్ ఇంజనీర్ టి.వి. సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

  • Related Posts

    ప్ర‌ధాని మొహ‌ర్రం పండుగ శుభాకాంక్ష‌లు

    Spread the love

    Spread the loveఇమామ్ హుస్సేన్ త్యాగం చిర‌స్మ‌ర‌ణీయం న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా శుక్ర‌వారం మొహ‌ర్రం పండుగ జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా జాతిని ఉద్దేశించి భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ముస్లిం సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. మొహర్రం సందర్భంగా…

    వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో డిస్పెన్సరీ ప్రారంభం

    Spread the love

    Spread the loveభ‌క్తుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించేందుకు కృషి తిరుమల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమ‌ల పుణ్య క్షేత్రం. కోట్లాది మంది శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని కొలుస్తారు. ఆయ‌న‌ను సేవిస్తారు. జీవితంలో ఒక్క‌సారైనా స్వామిని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *