బ్రహ్మోత్సవాలకు గడువు లోపు ఏర్పాట్లు పూర్తి చేయాలి

Spread the love

ఉన్న‌తాధికారుల‌కు నూత‌న ఈవో దిశా నిర్దేశం

తిరుమ‌ల : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత సేవా దృక్పధంతో, మరింత బాధ్యతగా సేవలు అందించాలని నూతనంగా ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేశారు. తిరుమల శ్రీ అన్నమయ్య భవన్ లోని సమావేశ మందిరంలో ఉన్నతాధికారులతో సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కేవలం 2 వారాలు మాత్రమే ఉన్నాయని, గడువు లోపుగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు శ్రీవారి సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడుకుంటూ, భక్తులకు ఇంకా ఎలాంటి మెరుగైన సేవలు అందించాలో సీఎం సూచించారన్నారు. అదే విధంగా టిటిడి చైర్మెన్ వచ్చే ఫీడ్ బ్యాక్, బోర్డు మెంబర్స్, డయల్ యువర్ ఈవో, ఐవిఆర్ఎస్, వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేకరణ, సర్వే తదితర మార్గాల ద్వారా ఎప్పటికప్పుడు భక్తులను అభిప్రాయ సేకరణ తీసుకుని ఇంకా మెరుగైన సేవలను అందించే అంశంపై దృష్టి పెట్టాలని కోరారు.

అదేవిధంగా వీలైనంత వరకు ఆధునిక టెక్నాలజీ సాయంతో మరింత మెరుగైన సేవలు అందించే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. టిటిడిలో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని ఆదేశించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్.

  • Related Posts

    ఘనంగా చంద్రన్న జన్మదిన వేడుకలు

    Spread the love

    Spread the loveభారీ ఎత్తున హాజ‌రైన టీడీపీ కార్య‌క‌ర్త‌లు శ్రీ స‌త్య‌సాయి జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు పుట్టిన రోజు ఇవాళ‌. ఈ సంద‌ర్బంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌ఘ‌నంగా వేడుక‌లు చేప‌ట్టారు. ప‌లువురు…

    సీఎం జ‌న్మ‌దినం టీటీడీ అన్న ప్ర‌సాదానికి విరాళం

    Spread the love

    Spread the loveరూ. 44 ల‌క్ష‌లు ఇచ్చిన భాష్యం విద్యా సంస్థ‌లు తిరుమ‌ల : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు ఏప్రిల్ 20. ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్బంగా ఇవాళ తిరుమ‌ల‌లోని అన్న ప్రసాదానికి రూ.44 లక్షల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *