విజ‌య‌వాడ ఉత్స‌వం ఏపీకి గ‌ర్వ‌కార‌ణం

Spread the love

ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు

అమరావతి : విజయవాడ ఉత్సవ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం దేశ వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న ఈ మహోత్సవం ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ కార్నివల్‌గా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

స్పీకర్ కార్యాలయంలో సోమ‌వారం శాసన సభ్యులు బోండా ఉమా , గద్దే రామ్మోహన్ , బోడె ప్రసాద్ మర్యాద పూర్వకంగా స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడును కలిశారు. విజయవాడ ఉత్సవానికి రావాల్సిందిగా ప్ర‌త్యేకంగా ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడారు. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు పున్నమి ఘాట్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఎంజీ రోడ్, ఘంటసాల సంగీత కళాశాల, విజయవాడ ఎక్స్పో వేదికలపై జరిగే ఈ ఉత్సవం విజయవాడ సాంస్కృతిక గౌరవాన్ని మరింతగా పెంచుతుందని ఆశా భావం వ్య‌క్తం చేశారు.

ఇంద్ర‌కీలాద్రి కొండ‌పై కొలువు తీరిన శ్రీ‌క‌న‌క దుర్గ‌మ్మ అమ్మ రి దసరా శోభాయాత్రల నడుమ జరుగుతున్న ఈ వేడుకల్లో భాగంగా ఒక్క నగరం – ఒకే ఉత్సవం అనే భావనతో నిర్వ‌హించ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు అయ‌య‌న్న‌పాత్రుడు. . యువ సోంలో రాష్ట్ర ప్రజలందరూ పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. దేవి కనకదుర్గ అమ్మవారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని అయ్య‌న్న పాత్రుడు ఆకాంక్షించారు.

  • Related Posts

    అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్ని స్థానాల్లో టీవీకే పోటీ

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న ప్ర‌క‌ట చేసిన పార్టీ చీఫ్ విజ‌య్ చెన్నై : ప్ర‌ముఖ న‌టుడు , టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. డీఎంకే స‌ర్కార్ తో తాడో పేడో తేల్చుకునేందుకు ఆయ‌న సిద్ద‌మ‌య్యారు. ఇప్ప‌టికే త‌న‌ను…

    ఇక నుంచి నిరంత‌రాయంగా జాబ్స్ భ‌ర్తీ

    Spread the love

    Spread the loveచేస్తామ‌ని ప్ర‌క‌టించిన ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఉద్యోగ నియామకాలు జరుగుతాయని ప్రజలు భావించారని అన్నారు. అయితే 2014 నుంచి 2024…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *