అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానం వాడాడు

Spread the love

ఐబొమ్మ ర‌విపై సీపీ స‌జ్జ‌నార్ షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ : ఐ బొమ్మ ఫౌండ‌ర్ ఇమ్మ‌డి ర‌వి కొట్టిన దెబ్బ‌కు టాలీవుడ్ విల విల లాడింది. ఈ సంద‌ర్బంగా క‌రేబియ‌న్ దీవుల‌లో ఉంటూ ఈ వెబ్ సైట్ ద్వారా వేలాది సినిమాల‌ను పైర‌సీ చేసి అప్ లోడ్ చేశాడు. హై ఎండ్ టెక్నాల‌జీ వాడాడు. చివ‌ర‌కు త‌న‌ను ప‌ట్టుకోవాలంటూ తెలంగాణ పోలీసుల‌కు కూడా స‌వాల్ విసిరాడు. త‌న భార్య‌తో ఉన్న విభేదాల కార‌ణంగా త‌ను ప‌ట్టుబ‌డిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. మొత్తంగా ఐబొమ్మ ఓన‌ర్ ఇమ్మ‌డి ర‌వికుమార్ ను ప‌ట్టుకోవ‌డం, త‌న‌ను నాంప‌ల్లి కోర్టులో హాజ‌రు ప‌ర్చ‌డం, చంచ‌ల్ గూడ జైలులో ఉండేలా చేయ‌డం జ‌రిగి పోయింది. ఈసంద‌ర్బంగా ఇందుకు సంబంధించిన కీల‌క అంశాలు వెల్ల‌డించారు సోమ‌వారం మీడియాకు సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్. ఒక ర‌కంగా సినిమా స‌న్నివేశాల‌ను త‌ల‌పించేలా జ‌రిగింద‌న్నారు ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి.

ఐబొమ్మ కార‌ణంగా చాలా సినిమాల‌కు పెద్ద ఎత్తున న‌ష్టం వాటిల్లింద‌ని వాపోయాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సంద‌ర్బంగా సినీ ప్ర‌ముఖులంతా వీసీ స‌జ్జ‌నార్ ను ప్ర‌త్యేకంగా అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. ఆయ‌న వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంద‌న్నారు. ఇమ్మ‌డి ర‌వి చేసిన స‌వాల్ ను స్వీక‌రించారు పోలీసులు. కేవ‌లం 2 నెల‌ల్లోనే త‌న‌ను ప‌ట్టుకోవ‌డం అద్భుతంగా ఉంద‌న్నాడు. ఈ సంద‌ర్బంగా రాజ‌మౌళి హెచ్చ‌రిక‌లు జారీ చేశాడు. పైర‌సీని తేలిక‌గా తీసుకోవ‌ద్ద‌ని కోరాడు. ఏదీ ఉచితంగా రాద‌ని, ఎల్ల‌ప్పుడూ దాచిన ఖ‌ర్చులు ఉంటాయ‌న్నాడు. పైర‌సీ సినిమాలు చూడ‌టం ఇబ్బందులు ఏర్ప‌డ‌తాయ‌ని పేర్కొన్నాడు. వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేస్తారు. మీ పేరు, నంబర్ లేదా ఇమెయిల్ సైబర్ నేరస్థుల చేతుల్లోకి వెళ్లవచ్చని , ఆర్థిక మోసానికి పాల్ప‌డే ఛాన్స్ ఉంద‌ని వార్నింగ్ ఇచ్చారు.

  • Related Posts

    దురంధ‌ర్ -2 మూవీ అద్బుతంగా ఉంది

    Spread the love

    Spread the loveకేంద్ర మంత్రి బండి సంజ‌య్ కుమార్ క‌రీంన‌గ‌ర్ జిల్లా : ఆదిత్య ధ‌ర్ తీసిన దురంధ‌ర్ -2 మూవీ ఇప్ప‌డు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతోంది. కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. మార్చి 19న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది ఈ…

    క‌ల‌ర్స్ 2.0 రూపంలో అత్యాధునిక సాంకేతికత‌

    Spread the love

    Spread the loveఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన న‌టి ఈషా రెబ్బా గాజువాక : మారుతున్న కాలానికి అనుగుణంగా సేవలను అప్‌డేట్ చేస్తూ ‘కలర్స్ 2.0’ రూపంలో అత్యాధునిక సాంకేతికతను ప్రజలకు అందిస్తుండ‌డం అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు న‌టి ఈషా రెబ్బా. యూఎస్-ఎఫ్‌డీఏ ఆమోదం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *