అసైన్డ్‌ భూములపై చర్చించాం : నారాయ‌ణ

Spread the love


రాజధాని రైతుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చిస్తాం

అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖా మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అమ‌రావ‌తి రాజధానిలో రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామ‌ని అన్నారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇప్ప‌టికే సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు కీల‌క క‌మిటీని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఇందులో త‌న‌తో పాటు కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ కూడా ఉన్నార‌ని చెప్పారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు స‌మావేశం కావ‌డం జ‌రిగింద‌న్నారు. రాజ‌ధాని నిర్మాణం కోసం స్వ‌చ్చంధంగా త‌మ భూములు ఇచ్చిన రైతుల‌కు న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. చాలా మంది రైతుల‌కు ఇప్ప‌టికే ప‌రిహారం అంద‌జేశామ‌న్నారు.

ఇదిలా ఉండ‌గా సమస్యలు మా దృష్టికి రాగానే అధికారులకు ఆదేశాలిస్తున్నట్లు చెప్పారు మంత్రి పొంగూరు నారాయ‌ణ‌. గ్రామ కంఠాల్లో కొందరికి అన్యాయం జరిగిందని చెబుతున్నారని, దీనిపై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెడ‌తామ‌ని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్‌ భూములపై అధ్యయనానికి రెవెన్యూ మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారని వెల్ల‌డించారు. ఇందులో తాను కూడా సభ్యుడిగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు పొంగూరు నారాయ‌ణ‌. ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై అసైన్డ్‌ భూములపై చర్చించాం అన్నారు.

  • Related Posts

    తెలుగుదేశం పార్టీలో క్లస్టర్లది కీలక పాత్ర

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన మంత్రి నారా లోకేష్ మంగ‌ళ‌గిరి : తెలుగుదేశం పార్టీలో క్లస్టర్లది చాలా కీలక‌మైన పాత్ర అని గుర్తు చేశారు మంత్రి నారా లోకేష్. యూనిట్, బూత్ లను సమర్థంగా నడిపించగల వ్యక్తులు మీరు. మీపై బాధ్యత…

    సింగ‌పూర్ ప్ర‌భుత్వ ప్ర‌తినిధుల‌తో ప‌య్యావుల భేటీ

    Spread the love

    Spread the loveకీల‌క అంశాల‌పై విస్తృతంగా చ‌ర్చ‌లు అమ‌రావ‌తి : అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధుల బృందంతో సమావేశం అయ్యారు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ . ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత సమర్థవంతమైన, నాణ్యమైన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *