క‌ల్తీ నెయ్యి కేసులో మ‌రో 11 మంది

Spread the love

నిందితుల‌ను చేర్చిన సిట్

అమ‌రావ‌తి : దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన తిరుమ‌ల క‌ల్తీ నెయ్యి కేసులో రోజు రోజుకు ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఈ కల్తీ నెయ్యి కేసులో మరో 11 మంది నిందితులను చేర్చింది ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం( సిట్ ) . దీంతో మొత్తం నిందితుల సంఖ్య 35కి చేరింది; నెల్లూరు ఎసిబి కోర్టులో మెమో దాఖలు చేసింది ద‌ర్యాప్తు బృందం. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు మ‌రికొంద‌రిని చేర్చింది. ఇదిలా ఉండ‌గా గతంలో కేసు నమోదు సమయంలో 15 మందిని, దర్యాప్తు సమయంలో మరో తొమ్మిది మందిని చేర్చింది సిట్.

తాజా చేరికలతో, మొత్తం నిందితుల సంఖ్య ఇప్పుడు 35కి పెరిగింది. నెల్లూరు ఎసిబి కోర్టుకు మెమో సమర్పించబడింది. 2019 నుంచి 2024 మధ్య సేకరణ విభాగంలో పనిచేసిన జనరల్ మేనేజర్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లపై సిట్ కేసులు నమోదు చేసింది. ఇప్పటివరకు, ఈ కేసుకు సంబంధించి 10 మందిని అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. మ‌రో వైపు అప్ప‌టి టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డిని, ఆయ‌న పీఎస్ ను కూడా విచారించింది సిట్. కేసు విచార‌ణ‌లో భాగంగా త‌నను నిన్న నాలుగు గంట‌ల పాటు విచారించ‌డం గ‌మ‌నార్హం.

  • Related Posts

    క‌ళ్యాణ మండ‌పం ఏర్పాటుకు స‌హ‌క‌రిస్తా

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఎంపీ డీకే అరుణ రెడ్డి నారాయ‌ణ‌పేట జిల్లా : మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఎంపీ డీకే అరుణ భ‌ర‌త సింహా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నేరడగం గ్రామంలో శ్రీ సిద్ధ…

    ఉత్సాహంగా మహిళా ఉద్యోగుల పోటీలు

    Spread the love

    Spread the loveఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుపతి : టీటీడీ ఆధ్వ‌ర్యంలో మార్చి 9న నిర్వ‌హించ‌నున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *