newsseals.com
DEVOTIONAL

టీటీడీ దేవాల‌యాల్లో అన్న‌దానం చేప‌ట్టాలి

VijayaBhaskar November 28, 2025
newsseals-APCM
Spread the love

ఈవో, చైర్మ‌న్ ను ఆదేశించిన ఏపీ సీఎం

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఆధ్వ‌ర్యంలోని అన్ని దేవాల‌యాల‌లో విధిగా అన్న‌దానం చేప‌ట్టేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను ఆదేశించారు. ఏ ఒక్క భ‌క్తుడు ఇబ్బంది ప‌డ కూడ‌ద‌న్నారు. దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

తిరుమలలో అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని దేవాలయాల్లో అమలు చేసే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. ప్రసాదం, అన్నప్రసాదంలో నాణ్యత పెంచేందుకు అవసరమైన సరుకుల ప్రొక్యూర్మెంట్‌లో తీసుకు వచ్చిన మార్పులను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు. ఈ సమీక్షకు దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తో పాటు టీటీడీ పాలక మండలి సభ్యులు హాజరయ్యారు. ఈ సంద‌ర్బంగా ఇటీవ‌ల తాము కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నామ‌ని తెలిపారు ఈవో. ప్ర‌తి రోజూ స్వామి వారిని ద‌ర్శించు కునేందుకు వ‌చ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ‌స‌తి స‌దు పాయాలు క‌ల్పించ‌డం జ‌రుగుతోంద‌న్నారు.