వెయ్యి స్తంభాల ఆల‌య సుందరీక‌ర‌ణ

చేప‌ట్టాల‌న్న కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

వ‌రంగ‌ల్ జిల్లా : వ‌రంగ‌ల్ జిల్లాలో విస్తృతంగా ప‌ర్య‌టించారు కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి జి. కిష‌న్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా వెయ్యి స్తంభాల ఆలయాన్ని సుందరీకరించాలని సంబంధిత జిల్లా క‌లెక్టర్, ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. హరిత ప్లాజాలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI), గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC), జౌళి మంత్రిత్వ శాఖ అధికారులతో సంభాషించారు. వరంగల్‌లోని కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్‌ను సందర్శించారు.

భద్రకాళి ఆలయం చుట్టూ పర్యాటక అభివృద్ధి, మామ్నూర్ విమానాశ్రయం, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, రైల్వే తయారీ యూనిట్ (RMU) కోసం భూసేకరణతో సహా కీలకమైన కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. కొనసాగుతున్న అన్ని ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. సాంస్కృతిక వార‌స‌త్వానికి ప్ర‌తీక‌గా ఉన్న ఓరుగ‌ల్లు లోని వేయి స్తంభాల ఆల‌య సుంద‌రీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టాల‌ని ఆదేశించారు కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *