ఘ‌నంగా కార్తీక దీపోత్స‌వం

శ్రీ గోవిందరాజ స్వామి ఆల‌యంలో
తిరుప‌తి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో గురువారం కార్తీక దీపోత్సవం ఘ‌నంగా నిర్వ‌హించారు. సాయంత్రం శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యం నుండి కార్తీక దీపం, వ‌స్త్రాల‌ను ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ గోవింద‌రాజ స్వామివారికి సమర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆలయం, ఉపాలయాల్లో కార్తీక దీపం వెలిగించారు. ఇదే స‌మ‌యంలో భారీ ఎత్తున భ‌క్తులు హాజ‌ర‌య్యారు. టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.

ఇదిలా ఉండ‌గా తిరుప‌తి న‌గ‌రంలోని అత్యంత పేరు పొందిన‌ శ్రీ కోదండ రామాలయంలో కూడా సాయంత్రం కార్తీక దీపోత్సవం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇందులో భాగంగా సాయంత్రం శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలోని శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధి నుండి ఆలయ మర్యాదలతో పడి, కార్తీకదీపం, నూతన వస్త్రాలను ఊరేగింపుగా శ్రీ కోదండ రామాలయానికి తీసుకువ‌చ్చి, కార్తీక దీపాలను వెలిగించారు. దీంతో ఆల‌యాలు స‌ర్వ‌శోభాయ‌మానంగా ఆక‌ట్టుకున్నాయి భ‌క్తుల‌ను.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *