టీటీడీ శాలువాల కొనుగోళ్ల‌పై ఏసీబీ విచార‌ణ‌

Spread the love

ఆదేశించిన‌ట్లు ప్ర‌క‌టించిన బీఆర్ నాయుడు

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి చైర్మ‌న్ బీఆర్ నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గ‌త జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హ‌యాంలో ఏర్పాటైన టీటీడీ పాల‌క మండ‌లి ప‌లు అక్రమాల‌కు పాల్ప‌డిన‌ట్లు తెలిపారు. బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. తాజాగా టీటీడీ బోర్డు స‌భ్యుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శాలువాల కొనుగోళ్ల‌లో పెద్ద ఎత్తున అక్రమాలు జ‌రిగాయ‌ని పాల‌క మండ‌లి స‌మావేశంలో తెలియ చేశార‌ని అన్నారు. ఈ మేర‌కు మొత్తం కొనుగోళ్ల‌కు సంబంధించిన వ్య‌వ‌హారంపై విచార‌ణ చేప‌ట్టామ‌న్నారు. దీంతో సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూశాయ‌న్నారు. బ‌య‌ట ధ‌ర రూ. 350 ఉండ‌గా గ‌త పాల‌క మండ‌లి ఏకంగా ఒక్కో శాలువాను రూ. 1350 కు కొనుగోలు చేసిన‌ట్లు డ‌బ్బులు డ్రా చేశారంటూ ఆరోపించారు. దాదాపు రూ. 80 నుంచి 90 కోట్ల మేర కుంభ‌కోణం జ‌రిగి ఉండ‌వ‌చ్చ‌ని తాము అంచ‌నా వేశామ‌న్నారు.

ఈ మేర‌కు శాలువాల కొనుగోళ్ల‌కు సంబంధించి ఏసీబీతో విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్లు ప్ర‌క‌టించారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. నివేదిక వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. బాధ్యులైన అధికారులపై ఇప్పటికే చ‌ర్య‌లు తీసుకోవ‌డం ప్రారంభం అయ్యింద‌న్నారు. గత ప్రభుత్వ కాలంలో కల్తీ నెయ్యి, నాసిరకం సరుకులు, పరకామణి చోరీ, టెండర్ల మార్పిడి వంటి అనేక అవినీతి కేసులు బయట పడ్డాయన్నారు. ఇవన్నీ దశల వారీగా బయటపెట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా ముందుకు సాగుతున్నామ‌ని చెప్పారు బీఆర‌ర్ నాయుడు.

  • Related Posts

    ఘనంగా చంద్రన్న జన్మదిన వేడుకలు

    Spread the love

    Spread the loveభారీ ఎత్తున హాజ‌రైన టీడీపీ కార్య‌క‌ర్త‌లు శ్రీ స‌త్య‌సాయి జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు పుట్టిన రోజు ఇవాళ‌. ఈ సంద‌ర్బంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌ఘ‌నంగా వేడుక‌లు చేప‌ట్టారు. ప‌లువురు…

    సీఎం జ‌న్మ‌దినం టీటీడీ అన్న ప్ర‌సాదానికి విరాళం

    Spread the love

    Spread the loveరూ. 44 ల‌క్ష‌లు ఇచ్చిన భాష్యం విద్యా సంస్థ‌లు తిరుమ‌ల : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు ఏప్రిల్ 20. ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్బంగా ఇవాళ తిరుమ‌ల‌లోని అన్న ప్రసాదానికి రూ.44 లక్షల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *