శ‌శాంక్ క‌నుమూరిని అభినందించిన సీఎం

Spread the love

ఏషియ‌న్ ఛాంపియ‌న్ షిప్ లో ప్ర‌తిభ

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించిన ఏపీలోని భీమ‌వ‌రానికి చెందిన శశాంక్ క‌నుమూరిని అభినందించారు. థాయ్ పొలో క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంటింగ్ ఏషియన్ ఛాంపియన్ షిప్-2025లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఈక్వెస్ట్రియన్ ఈవెంటింగ్ క్రీడలో అద్బుత‌మైన ప్ర‌తిభ‌ను చాటాడు. అంద‌రినీ విస్తు పోయేలా చేశాడు. చివ‌ర‌కు ప‌తకాన్ని కైవ‌సం చేసుకున్నాడు. ఈ సంద‌ర్బంగా తాను సాధించిన మెడ‌ల్ తో ముఖ్య‌మంత్రిని మ‌ర్యాద పూర్వ‌కంగా అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో క‌లిశాడు.

ఈ సంద‌ర్బంగా టోర్నీలో త‌న అనుభ‌వాన్ని ముఖ్య‌మంత్రితో పంచుకున్నాడు. గుర్రాలతో హర్డిల్స్ దాటే ఈక్వెస్ట్రియన్ ఈవెంటింగ్ లో తనకు పదేళ్ల అనుభవం ఉందని క్రీడాకారుడు శశాంక్ తెలిపారు. రాష్ట్రానికి పేరు తెచ్చిన క్రీడాకారుడు శశాంక్ కనుమూరి మరింతగా రాణించాలని ఆకాంక్షించారు నారా చంద్ర‌బాబు నాయుడు. రాబోయే రోజుల్లో బంగారు ప‌త‌కాల‌తో రావాల‌ని కోరారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు శ‌శాంక్ కు. ప్ర‌భుత్వ ప‌రంగా ఎలాంటి స‌హాయ‌మైనా చేసేందుకు సిద్దంగా ఉన్నామ‌ని, క్రీడ‌పై మ‌రింత ప‌ట్టు పెంచుకునేందుకు కృషి చేయాల‌ని సూచించారు.

  • Related Posts

    స‌త్తా చాటిన సాయి సుద‌ర్శ‌న్ , సుంద‌ర్

    Spread the love

    Spread the love82 ప‌రుగుల తేడాతో గుజ‌రాత్ టైటాన్స్ విక్ట‌రీ అహ్మ‌దాబాద్ : ఆశిష్ నెహ్రా మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో గుజ‌రాత్ టైటాన్స్ దుమ్ము రేపుతోంది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో స‌త్తా చాటుతూ ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.…

    జూలు విదిల్చిన కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్

    Spread the love

    Spread the love3 వికెట్ల తేడాతో పంజాబ్ పై ఢిల్లీ విక్ట‌రీ ధ‌ర్మ‌శాల : ఐపీఎల్ 2026 మెగా టోర్న‌మెంట్ లో భాగంగా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కు కోలుకోలేని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *