బ‌ర్ట్ ఆస్ప‌త్రిలో త్వ‌ర‌లో ఖాళీల భ‌ర్తీ

ప్ర‌క‌టించిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్

తిరుమ‌ల : టీటీడీ చైర్మ‌న్ బి.ఆర్.నాయుడు అధ్య‌క్ష‌త‌న‌ బ‌ర్డ్ ఆసుప‌త్రి , హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్య‌క‌లాపాల‌పై తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో ట్రస్టు, ఎక్జిక్యూటివ్ క‌మిటీ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశాలలో ప‌లు అంశాల‌పై చ‌ర్చించి నిర్ణ‌యాలు తీసుకున్నారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్, సింఘాల్‌, టీటీడీ బోర్డు స‌భ్యులు జాన‌కి దేవి, నరేష్ కుమార్, బర్డ్ డైరెక్టర్ డా జగదీశ్, హెచ్‌డీపీపీ సెక్ర‌ట‌రీ శ్రీ‌రామ్ ర‌ఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. బ‌ర్డ్ ఆసుప‌త్రిలో ఆర్థో, ఇన్ పేషంట్ సేవ‌ల‌ను బ‌లోపేతం చేసేందుకు ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు మ‌రింత మంది డాక్ట‌ర్లు, పారా మెడిక‌ల్ సిబ్బంది నియామ‌కం చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

భ‌ద్ర‌త‌, పారిశుద్ధ్య సేవ‌ల‌ను మ‌రింత మెరుగు ప‌రిచేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు కలిగి ఉండి, మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్న రోగులలో ఏటా 100-150 మంది రోగులకు అయ్యే పూర్తి ఖర్చును భరించడానికి చెన్నైకి చెందిన గువీ హెల్త్ కేర్ ఛారిటబుల్ ట్రస్ట్ ముందుకు వ‌చ్చింద‌ని అన్నారు. వారి సేవలను వినియోగించు కునేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. అంత‌కు ముందు హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌క‌లాపాల‌పై ఎగ్జిక్యూటివ్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో హిందూ ధ‌ర్మ ప్ర‌చారాన్ని మ‌రింత విస్తృతం చేయాల‌ని ఆదేశించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.

  • Related Posts

    వేగంగా వేంకటపాలెం శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు

    అమ‌రావ‌తి : అమరావతిలోని వేంకటపాలెం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణ పనులను టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ పరిశీలించారు. 2వ ప్రాకారం, నాలుగు గాలి గోపురాల పనుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆలయంలోని 2వ ప్రాకారం,…

    శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భ‌ద్ర‌త

    తిరుపతి : తిరుమల రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా తిరుమల పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుమలలోని వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్, సెక్యూరిటీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *