ఏపీలో రికార్డు స్థాయిలో మిర్చి ఉత్ప‌త్తి

Spread the love

మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి : ఏపీలో రికార్డ్ స్థాయిలో మిర్చి ఉత్ప‌త్తి జ‌రిగింద‌ని చెప్పారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఈ సీజన్‌లో సుమారు 5.39 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధ్యమవుతుందని అంచనా వేశామ‌న్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, నారుమడి పెంపకం, సమగ్ర సస్యరక్షణపై గ్రామస్థాయిలో నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పురుగు మందుల అవశేషాలు లేకుండా నాణ్యమైన మిర్చి ఉత్పత్తి లక్ష్యంగా IPM, INM విధానాలపై శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. డిజిటల్ గ్రీన్, ITC సంస్థల సహకారంతో మిర్చి నాణ్యత ప్రమాణాలు పెంచుతున్నామని తెలిపారు.

గత సీజన్‌లో కామన్ రకాలకు క్వింటాలుకు రూ.12,500, స్పెషల్ రకాలకు రూ.13,500 ధర లభించగా, ఈ ఏడాది ప్రస్తుతం రూ.15,000 నుంచి రూ.19,500 వరకు ధరలు నమోదవుతున్నాయని మంత్రి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల వల్ల కేవలం మిర్చి మాత్రమే కాకుండా అన్ని పంటలకు కూడా మెరుగైన ధరలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకతలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సుమారు 1.97 లక్షల మంది రైతులు 2.49 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తుండగా, హెక్టారుకు సగటున 19.81 మెట్రిక్ టన్నుల ఉత్పాదకత సాధిస్తున్నారని చెప్పారు.

  • Related Posts

    త‌మిళ‌నాడులో ఓటు వేసిన సీఎం ఎంకే స్టాలిన్

    Spread the love

    Spread the loveఈసారి కూడా ఇండియా కూట‌మిదే విజ‌యం త‌మిళ‌నాడు : ఈసారి కూడా త‌మిళ‌నాడులో డీఎంకే ఇండియా కూట‌మి విజ‌యం సాధించడం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు సీఎం ఎంకే స్టాలిన్. త‌న భార్య‌తో క‌లిసి గురువారం త‌మ ఓటు హ‌క్కు…

    టువాస్ పోర్టును సంద‌ర్శించిన మంత్రులు

    Spread the love

    Spread the loveసింగ‌పూర్ లో కొన‌సాగుతున్న అధికారిక ప‌ర్య‌ట‌న సింగ‌పూర్ : ఏపీకి చెందిన మంత్రులు సింగ‌పూర్ లో ప‌ర్య‌టిస్తున్నారు . ఈ ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి, అన‌గాని స‌త్య ప్ర‌సాద్, కింజారపు అచ్చెన్నాయుడు, పొంగూరు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *