సింగరేణి స్కాంపై విచార‌ణ జ‌రిపించాలి : కేటీఆర్

Spread the love

డిమాండ్ చేసిన బీఆర్ఎస్ వ‌ర్కంగ్ ప్రెసిడెంట్

హైద‌రాబాద్ : తెలంగాణ కొంగు బంగారంగా వినుతికెక్కిన సింగ‌రేణి ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి చోటు చేసుకున్న స్కాంపై విచార‌ణ జ‌రిపించాల‌ని , దోషులు ఎవ‌రో తేల్చాల‌ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. త‌న నాయకత్వంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు , ఇతర నాయకులతో కూడిన ఒక ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసింది.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో టెండర్లు, కొనుగోళ్లు, విధానాలు , సీఎస్ఆర్ సంబంధిత అవకతవకలపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ఈ ప్రతినిధి బృందం గవర్నర్‌కు ఒక వినతిపత్రాన్ని సమర్పించింది.

నైని కోల్ బ్లాక్ కేటాయింపులో జరిగిన అవకతవకలు మరియు SCCL యొక్క సీఎస్ఆర్ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆధారాలు , అనుబంధ పత్రాలను గవర్నర్‌కు సమర్పించారు.
సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి కాబట్టి, దానిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసే వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టాలని కోరారు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకుని సమగ్ర విచారణకు ఆదేశించాల‌ని విన్న‌వించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన‌ట్లు చెప్పారు మాజీ మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని, రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ఆరోపించారు. ఓ వైపు రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ గాడి త‌ప్పితే మ‌రో వైపు దావోస్ పేరుతో ఎంజాయ్ చేస్తున్నాడంటూ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు కేటీఆర్.

  • Related Posts

    త‌మిళ‌నాడులో ఓటు వేసిన సీఎం ఎంకే స్టాలిన్

    Spread the love

    Spread the loveఈసారి కూడా ఇండియా కూట‌మిదే విజ‌యం త‌మిళ‌నాడు : ఈసారి కూడా త‌మిళ‌నాడులో డీఎంకే ఇండియా కూట‌మి విజ‌యం సాధించడం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు సీఎం ఎంకే స్టాలిన్. త‌న భార్య‌తో క‌లిసి గురువారం త‌మ ఓటు హ‌క్కు…

    టువాస్ పోర్టును సంద‌ర్శించిన మంత్రులు

    Spread the love

    Spread the loveసింగ‌పూర్ లో కొన‌సాగుతున్న అధికారిక ప‌ర్య‌ట‌న సింగ‌పూర్ : ఏపీకి చెందిన మంత్రులు సింగ‌పూర్ లో ప‌ర్య‌టిస్తున్నారు . ఈ ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి, అన‌గాని స‌త్య ప్ర‌సాద్, కింజారపు అచ్చెన్నాయుడు, పొంగూరు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *