newsseals.com
DEVOTIONAL

టీటీడీ ట్రస్టులకు రూ.70 లక్షలు విరాళం

VijayaBhaskar March 18, 2026
newsseals-TTDDonations
Spread the love

అభినందించిన ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌

తిరుప‌తి : కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వినుతికెక్కింది తిరుమ‌ల‌. ఇక్క‌డ కొలువైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకునేందుకు ప్ర‌తినిత్యం కోట్లాది మంది వ‌స్తుంటారు. స్వామిని కొలిస్తే కోరిన కోర్కెలు తీరుతాయ‌ని ప్ర‌గాఢ న‌మ్మ‌కం, విశ్వాసం కూడా. ఇదిలా ఉండ‌గా భ‌క్తులు, సంస్థ‌లు, వ్యాపార‌, వాణిజ్య‌వేత్త‌లు, కార్పొరేట్ సంస్థ‌లు, కంపెనీలు, ప్ర‌ముఖులు ప్ర‌తి నిత్యం టీటీడీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే ట్ర‌స్టుల‌కు విరాళాలు అందిస్తూ వ‌స్తున్నారు. తాజాగా టీటీడీ ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్రస్టుకు బుధ‌వారం రూ.70 లక్షలు విరాళంగా అందింది.

నెల్లూరు జిల్లాకు చెందిన శంక‌ర్ ఎంట‌ర్ ప్రైజెస్ అధినేత జ‌య‌శేఖ‌ర్‌ రూ.10 ల‌క్ష‌లు, చిత్తూరుకు చెందిన బాలాజీ ప్యాకింగ్ ఇండ‌స్ట్రీస్‌ ర‌మేష్‌బాబు రూ.10 ల‌క్ష‌లు, వినాయ‌క ఫౌల్ట్రీఫాం అధినేత రాధ శ్రీ‌నివాసులు రూ.10 ల‌క్ష‌లు, చిత్తూరు జిల్లా కొటార్ల‌ప‌ల్లికి చెందిన మంజునాథ్ రూ.10 ల‌క్ష‌లు, శ్రీ‌వారి ఫౌల్ట్రీఫాం అధినేత హేమాద్రి రూ.10 ల‌క్ష‌లు, ఫౌల్ట్రీఫాం అధినేత ర‌వికుమార్ రూ.10 ల‌క్ష‌లు, ప‌ల‌మ‌నేరుకు చెందిన ఎస్ ఆర్ ఎస్‌ ఎంట‌ర్ ప్రైజ‌స్ అధినేత పురుషోత్తం రూ.10 ల‌క్ష‌లు విరాళంగా అందించారు.

ఈ మేరకు దాతలు విరాళం డిడిలను తిరుప‌తిలోని ఈవో బంగ్లాలో టీటీడీ ఈవో ఎం.ర‌విచంద్ర‌కు అందజేశారు. ఈసంద‌ర్బంగా భారీ ఎత్తున విరాళాలు అందించిన దాత‌ల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు . వారికి స్వామి వారి కృప ఉండాల‌ని కోరారు.