శాశ్వ‌త రాజ‌ధానిగా అమ‌రావ‌తి కోసం తీర్మానం

అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టిన సీఎం చంద్ర‌బాబు

అమరావతి : ఏపీ కూట‌మి స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. శ‌నివారం శాస‌న స‌భ‌లో చారిత్రాత్మ‌క నిర్ణ‌యానికి శ్రీ‌కారం చుట్టారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించేలా చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సంద‌ర్బంగా రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్ట‌డాన్ని మంత్రివ‌ర్గం , ప్ర‌జా ప్ర‌త‌నిధులు ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన, స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగటం అత్యవసరమని అభిప్రాయం వ్యక్తం చేస్తూ తీర్మానం చేశారు.

రాజధానికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ తీర్మానం ప్రవేశపెట్టిడం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 5(2)కు తగిన సవరణలు చేయటం ద్వారా రాజధానిపై స్పష్టతను ,స్థిరత్వాన్ని కల్పించ వచ్చని గుర్తించేలా తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్టిన‌ట్లు ప్ర‌క‌టించారు శాస‌న స‌భ వేదిక‌గా సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే స్పీక‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు .ఆ మేర‌కు రూల్ కూడా ప్ర‌వేశ పెట్టారు. మొత్తంగా రాజ‌ధానిగా అమ‌రావ‌తికి లైన్ క్లియ‌ర్ కానుంది. అలా కావాలంటే పార్ల‌మెంట్ లో ఆమోదం పొందాల్సి ఉంటుంది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *