ఎన్జీటీ డిస్పోజ‌ల్ చేసింది కానీ డిస్మిస్ చేయ‌లేదు

Spread the love

మూసీ ప్రాజెక్టుపై కేసు కొన‌సాగుతుందన్న కార్తీక్ రెడ్డి

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ప‌టోళ్ల కార్తీక్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా కాంగ్రెస్ స‌ర్కార్ త‌ల‌పెట్టిన మూసీ పున‌ర్ నిర్మాణం పేరుతో చేప‌ట్టిన ప్రాజెక్టుపై తాను నేష‌న‌ల్ గ్రీన్ ట్రైబ్యూన‌ల్ లో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీని వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి ముప్పు ఏర్ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. ఈ త‌రుణంలో కేసును విచారించింది ఎన్జీటీ . ఈ సంద‌ర్భంగా కీల‌క సూచ‌న‌లు చేసింది. అయితే మూసీ ప్రాజెక్టుపై తాను వేసిన NGT కేసు డిస్మిస్ అయినట్లు జ‌రుగుతున్న ప్ర‌చారం పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని అన్నారు. ప‌టోళ్ల కార్తీక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

డిస్మిసల్ వేరు డిస్పోజల్ వేరు, మీడియా వాళ్లు అది గమనించకుండా సీఎంవో నుండి వచ్చిన లీకులతో నిరాధార‌మైన వార్త‌లు ప్ర‌చురిస్తున్నార‌ని ఆరోపించారు. డిస్పోజల్ అంటే మనం అడిగిన ప్రశ్నలకు, లేవనెత్తిన వివాదాలకు పాల్పడకుండా ప్రభుత్వానికి మార్గదర్శకాలు ఇవ్వడం అని అన్నారు. మూసీలో MFL, FTL లెవెల్స్ ఫిక్స్ కాలేదన్నారు, ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తాను NGT లో పిటిషన్ దాఖలు చేశాన‌ని చెప్పారు. దానికి జడ్జి స్పందిస్తూ, ప్రభుత్వం మీరు లేవనెత్తిన అంశాలు పరిగణనలోకి తీసుకుంటానని చెప్పింది కదా, ఒకవేళ అవి ఉల్లంఘిస్తే తిరిగి మమ్మల్ని ఆశ్రయించండి అని చెప్పార‌న్నారు. మా పిటిషన్ డిస్పోజల్ చేసింది కానీ డిస్మిస్ చేయలేదని నొక్కి చెప్పారు.

  • Related Posts

    సైబ‌ర్ నేరాల‌పై నియంత్ర‌ణ అవ‌స‌రం

    Spread the love

    Spread the loveయాక్ష‌న్ ప్లాన్ త‌యారు చేయాల‌న్న సీఎం అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో సైబ‌ర్ నేరాల నియంత్ర‌ణ‌కు త‌క్ష‌ణ‌మే యాక్ష‌న్ ప్లాన్ త‌యారు చేయాల‌ని ఆదేశించారు. స‌చివాల‌యంలో సైబ‌ర్ ఫ్రాడ్…

    రైతుల ధాన్యానికి ఏపీ స‌ర్కార్ భ‌రోసా

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు రైతుల‌కు తీపి క‌బురు చెప్పింది. రైతులు న‌ష్ట పోకుండా క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించేందుకు కేంద్రం సానుకూలంగా వ్య‌వ‌హ‌రించింద‌ని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *