వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుపతి : టీటీడీ కీలక ప్రకటన చేసింది. టీటీడీ ఆధ్వర్యంలోని హిందూ ధర్మప్రచార పరిషత్ భక్తులలో మరింత భక్తి భావం పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ధర్మ ప్రచార కార్యక్రమాలు భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేందుకు నిరంతరం నిర్వహించ బడుతున్నాయి. ఈ కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఏప్రిల్ 16వ తేదీ గురువారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 5.30 గంటలకు ధార్మికోపన్యాసం చేయనున్నారు.
ఈ సందర్భంగా ఆయన “నిత్య జీవితంలో ధర్మాచరణం” అనే అంశంపై భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించనున్నారని వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ). భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ ధార్మిక ఉపన్యాసాన్ని ఆలకించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవలసిందిగా టీటీడీ కోరింది. అంతే కాకంఉడా చాగంటి ఉపన్యాసాన్ని టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారం చేస్తుందని తెలిపింది.








