ఇషాన్ కిష‌న్ ధ‌నా ధ‌న్ రాజ‌స్థాన్ లాస్

Spread the love

19 ఓవ‌ర్ల‌లో 159 ప‌రుగుల‌కే రాయ‌ల్స్ క్లోజ్

హైద‌రాబాద్ : ఐపీఎల్ 2026లో ఊహించ‌ని రీతిలో బిగ్ షాక్ త‌గిలింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు. వ‌రుస విజ‌యాల‌తో దూకుడు మీదున్న ఆ జ‌ట్టు స‌న్ రైజ‌ర్స్ బౌల‌ర్లు ప్ర‌పుల్ హింగే, న‌కీబ్ హ‌స్స‌న్ ల బౌలింగ్ దెబ్బ‌కు విల విల లాడారు. బంతుల‌ను ఆడ‌లేక వికెట్ల‌ను పారేసుకున్నారు. చివ‌ర‌కు ఫెరీరా, ర‌వీంద్ర జ‌డేజాలు ఆదుకున్నారు. దీంతో ప‌రువు పోకుండా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను కాపాడారు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా హింగే రికార్డు సృష్టిస్తే..తనదైన పేస్‌తో సకీబ్‌..రాయల్స్‌ నడ్డివిరిచాడు. బుల్లెట్‌లా దూసుకొచ్చిన బంతులను ఆడటంలో రాయల్స్‌ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు.

ఈ స‌మ‌యంలో రాజ‌స్థాన్ క‌నీసం 50 ప‌రుగులైనా చేస్తుందా అన్న అనుమానం నెల‌కొంది. ఈ త‌రుణంలో ఫెరీరా, జ‌డేజాలు అడ్డు గోడ‌లా నిల‌బ‌డ్డారు. ఫ‌రీరా 44 బాల్స్ ఎదుర్కొని 69 ర‌న్స్ చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. ఇక జ‌డేజా 32 బంతులు ఎదుర్కొని 45 ర‌న్స్ చేశాడు. ఇందులో 5 ఫోర్లు ఉన్నాయి. 19 ఓవ‌ర్ల‌లో 159 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. అంత‌కు ముందు టాస్ కోల్పోయి మైదానంలోకి దిగిన స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు సూప‌ర్ షో చేసింది. కెప్టెన్ కిష‌న్ షాన్ దార్ ఇన్నింగ్స్ ఆడాడు. త‌ను 44 బాల్స్ ఎదుర్కొని 91 ర‌న్స్ చేశాడు. ఇందులో 8 ఫోర్లు , 6 సిక్సులు ఉన్నాయి. త‌న‌తో పాటు క్లాస‌న్ కూడా దంచి కొట్టాడు.

  • Related Posts

    హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై అశ్విన్ కామెంట్స్

    Spread the love

    Spread the loveఆర్సీబీ చేతిలో ఓట‌మి పాలైన ముండై ఇండియ‌న్స్ ముంబై : ఐపీఎల్ 2026లో భాగంగా జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేతిలో ఓట‌మి పాలైంది స్వంత గ‌డ్డ‌పై ముంబై ఇండియ‌న్స్.…

    క్రికెట్ లెజండ్ క‌పిల్ దేవ్ తో గంటా భేటీ

    Spread the love

    Spread the loveఈ క‌ల‌యిక మ‌రిచి పోలేనంటూ కామెంట్స్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌తీయ క్రికెట్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న ఏకైక క్రికెట‌ర్ క‌పిల్ దేవ్ నిఖంజ్. త‌న‌ను ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *