newsseals.com
News

ఈ నెల 19న తెలంగాణ అస్థిత్వ వేదిక ఏర్పాటు

VijayaBhaskar April 17, 2026
newsseals-VPrakash
Spread the love

రవీంద్రభారతిలో తెలంగాణ అస్థిత్వ వేదిక

హైద‌రాబాద్ : వంద‌లాది మంది బ‌లిదానం చేయ‌డంతో తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింది. ప‌ది సంవ‌త్స‌రాల పాటు ఆత్మ గౌరవం భంగం వాటిళ్ల‌కుండా ప్ర‌య‌త్నం చేశారు బీఆర్ఎస్ హ‌యాంలో కేసీఆర్. కానీ అనూహ్యంగా దొర చేసిన నిర్వాకం కార‌ణంగా ప్ర‌జ‌లు ఛీ కొట్టారు. ఆపై అహంకారానికి చెక్ పెట్టారు. చివ‌ర‌కు రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్ పార్టీకి ప‌వ‌ర్ ను అప్ప‌గించారు. తీరా రేవంత్ రెడ్డి కొలువు తీరాక రాష్ట్రంలో అస్తిత్వం అన్న‌ది లేకుండా పోయింది. ఈ త‌రుణంలో మేధావులు మ‌ళ్లీ మాట్లాడ‌టం మొద‌లు పెట్టారు. ఇందుకు కీల‌క‌మైన తెలంగాణ మేధావులు ముందుకు వ‌చ్చారు. ఇందుకు సంబంధించి తెలంగాణ అస్తిత్వ వేదికను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు అప‌ర మేధావి వి. ప్ర‌కాష్.

శుక్ర‌వ‌రాం ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ అస్థిత్వ వేదిక సమావేశం జ‌రిగింది. 14 ఏళ్లు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ 12 ఏళ్ల తర్వాత తెలంగాణ అస్థిత్వంపై దాడి జరుగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్పటికీ చంద్రబాబుతో పాటు ఆంధ్రా నాయకులు మన మీద దుర్భాష లాడుతున్నారని ఆరోపించారు. తాజాగా బీజేపీకి చెందిన క‌ర్ణాట‌క ఎంపీ తేజ‌స్వి సూర్య పార్ల‌మెంట్ సాక్షిగా నోరు పారేసుకున్నారు. మన సంస్కృతి ప్రతీకలు మాయమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జలవనరులకు సంబంధించిన ఆస్తులు కూడా ధ్వంసం అయ్యే పరిస్థితి నెల‌కొంద‌ని పేర్కొన్నారు రిటైర్డ్ ఇంజినీర్ శ్రీధర్ రావు దేశ్ పాండే.