newsseals.com
News

లౌకిక వాదానికి నియంతృత్వానికి మ‌ధ్య పోటీ

VijayaBhaskar April 21, 2026
newsseals-KCVenugopal
Spread the love

నిప్పులు చెరిగిన ఏఐసీసీ జీఎస్ కేసీ వేణుగోపాల్

త‌మిళ‌నాడు : ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మిళ‌నాడులో ఈనెల 23న ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇండియా కూట‌మి త‌ర‌పున పాల్గొని ప్ర‌సంగించారు . ఈ ఎన్నికలు వాస్తవానికి తమిళ సంస్కృతి, లౌకికవాద భావజాలానికి, ప్రధాని మోదీ విభజనవాద, నియంతృత్వ పాలనకు మధ్య జరుగుతున్నవని స్ప‌ష్టం చేశారు. బీజేపీ మొత్తం ఎన్నికలను హైజాక్ చేయాలని చూస్తోందని ఆరోపించారు.

అందుకోసం వారు ఏఐఏడీఎంకేను ఒక ఆయుధంగా ఎంచుకున్నారని మండిప‌డ్డారు కేసీ వేణుగోపాల్. వారు తమిళనాడులో సీట్ల సంఖ్యను తగ్గించాలని చూస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రతిపక్షమంతా, భారత కూటమి, కాంగ్రెస్, డీఎంకే కలిసి పోరాడి వారిని ఓడించాయన్నారు. ఈ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ కూటమి సునాయాసంగా గెలుస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటు కేసీ వేణుగోపాల్ స్టాలిన్‌తో సంయుక్త సమావేశానికి హాజరయ్యారు.. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన మూడు స‌భ‌ల‌లో పాల్గొన్నారు. ఇండియా కూట‌మికి ఓటు వేసి గెలిపించాల‌ని కోరారు.