మే 10న ప్ర‌ధాని మోదీ హైద‌రాబాద్ కు రాక‌

Spread the love

భారీ ఏర్పాట్లు చేస్తున్నామ‌న్న బీజేపీ చీఫ్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మే 10వ తేదీన దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ప‌ర్య‌టించ‌నున్నార‌ని వెల్ల‌డించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద‌ర్ రావు. ఆయ‌న కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డితో క‌లిసి మాట్లాడారు మీడియాతో. మోదీహైదరాబాద్ పర్యటన నేపథ్యంలో నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జ‌రిగింద‌ని చెప్పారు. ఈ సందర్భంగా తోటి ఎంపీలు, ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటన ఏర్పాట్లు , కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. మోదీ పర్యటనను సక్సెస్ చేసేందుకు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

పార్టీకి చెందిన బాధ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రుల‌తో పాటు నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున మోదీ ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు బీజేపీ చీఫ్ రాంచంద‌ర్ రావు. కేంద్ర మంత్రితో పాటు పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి , జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ ల‌క్ష్మ‌ణ్‌,
ర‌ఘునంద‌న్ రావు, ద‌ర్మ‌పురి అర్వింద్, ఈట‌ల రాజేంద‌ర్ , డీకే అరుణ భ‌ర‌త సింహా రెడ్డి, శాస‌న మండ‌లి ప‌క్ష నేత‌లు మ‌హేశ్వ‌ర్ రెడ్డి, ఏవీఎన్ రెడ్డి, ధ‌న్ పాల్ సురాన‌, అంజిరెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • Related Posts

    సేవాద‌ళ్ వాలంటీర్ల సేవ‌లు ప్ర‌శంస‌నీయం

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హైద‌రాబాద్ : సేవాద‌ళ్ వాలంటీర్లు చేస్తున్న సేవ‌ల గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు. కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న ‘సమర్థ్‌’…

    బీజేపీలోకి వెళ్ల‌డం లేదు బీఆర్ఎస్ లోనే ఉన్నా

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన మాజీ మంత్రి మ‌ల్లారెడ్డిహైద‌రాబాద్ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొన్ని రోజులుగా త‌మ కుటుంబంపై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. కేవ‌లం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *