శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీ నృసింహ జయంతి

Spread the love

భారీ ఏర్పాట్లు చేసిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో నృసింహ స్వామి జయంతి ఘనంగా జరిగింది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఈ ఉత్సవం నిర్వ‌హిస్తారు. శ్రీ యోగ నరసింహ స్వామివారి మూలమూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేశారు. శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున గల మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహ స్వామివారి ఉప ఆలయం ఉంది. యోగముద్రలో ఉన్న ఈ విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు.

స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతులలో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీ యోగ నరసింహ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడి స్వామి వారు సగభాగం మానవ రూపంలోనూ, మరో సగభాగం శ్రీవారి అవతారమైన సింహం రూపంలోనూ ఉంటారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణ

    Spread the love

    Spread the loveభారీ ఎత్తున హాజ‌రైన భ‌క్త బాంధ‌వులు..టీటీడీ భారీ ఏర్పాట్లు తిరుపతి : తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుండి 7.30 గంటల వరకు పుణ్యా హవచనం, రక్షా…

    సింహాచ‌లం స‌న్నిధిలో అశ్విని వైష్ణ‌వ్, బాబు

    Spread the love

    Spread the loveతెలుగు ప్ర‌జ‌లు బాగుండాల‌ని కోరుకున్నా విశాఖ‌ప‌ట్నం జిల్లా : విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ కు శంకుస్థాపన అనంతరం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి అశ్విని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *