వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగితే చ‌ర్య‌లు : డీజీపీ

క్రైమ్ మీటింగ్స్ ద్వారా ప‌నితీరు ప‌ర్య‌వేక్షిస్తాం

హైద‌రాబాద్ : నూత‌న డీజీపీగా కొలువు తీరిన సీవీ ఆనంద్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రైనా స‌రే ఏస్థాయిలో ఉన్నా స‌రే , కీల‌క ప‌ద‌వుల‌లో ఉన్నా , వ్య‌క్తిగ‌త దూష‌ణల‌కు దిగితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు . మిగిలి ఉన్న వారు కూడా పునరావాస పాలసీ ప్రకారం జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తుది దశలో ఉందన్నారు డీజీపీ. త్వరలోనే సమీక్షించి దానికి అనుగుణంగా చార్జ్ షీట్ వేస్తామని తెలిపారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు దిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

రాజ్యాంగ బద్ధమైన భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తామన్నారు సీవీ ఆనంద్. చివరగా, తాను ‘మెక్రో మేనేజ్‌మెంట్’ విధానాన్ని అనుసరిస్తానని చెప్పారు. క్షేత్రస్థాయి అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తూనే క్రైమ్ మీటింగ్స్ ద్వారా వారి పనితీరును పర్యవేక్షిస్తానని డిజిపి సి.వి. ఆనంద్ స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో శాంతి భద్రతల డిజి మహేష్ ఎం భగవత్, టిఎస్ఎల్పిఆర్బి చైర్మన్ వివి శ్రీనివాసరావు, ఎస్పిఎఫ్ డిజి స్వాతి లక్రా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సి సజ్జనార్, డిజి, సిఐడి చారు సిన్హా, గ్రేహౌండ్స్ , ఆక్టోపస్ డిజి అనిల్ కుమార్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *