సిరుల తల్లికి స్న‌ప‌న తిరుమంజ‌నం

Spread the love

ఘ‌నంగా వ‌సంతోత్స‌వాల నిర్వ‌హ‌ణ

తిరుప‌తి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాల భాగంగా మధ్యాహ్నం 2.30 గంటలకు శుక్రవారం తోటలో స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు భక్తులకు కనువిందు చేశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాథ్, ఏఈఓ దేవరాజులు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యల భక్తులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) పాల‌క మండ‌లి ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుండి త‌ర‌లి వ‌చ్చారు భ‌క్త బాంధ‌వులు. సిరుల త‌ల్లి అమ్మ వారిని కొలిచినా, పూజ‌లు చేసినా పుణ్యం ద‌క్కుతుంద‌ని ప్ర‌గాఢ న‌మ్మ‌కం. ఇదిలా ఉండ‌గా ప్ర‌తి ఏటా సిరుల త‌ల్లి అమ్మ వారికి స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

  • Related Posts

    వైభ‌వోపేతంగా ప‌త్ర పుష్ప యాగం

    Spread the love

    Spread the loveభక్తులకు దివ్య‌మైన అనుభూతి తిరుప‌తి : తిరుప‌తి శ్రీ క‌పిలేశ్వ‌ర ఆల‌యంలో ప‌త్ర పుష్ప యాగం వైభవంగా జ‌రిగింది. ఉద‌యం స్వామివారిని సుప్ర‌భాతంతో మేల్కొలిపి, అభిషేకం నిర్వ‌హించారు. ఉద‌యం 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీ క‌పిలేశ్వ‌ర…

    తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

    Spread the love

    Spread the loveఆల‌య మాడ వీధుల్లో విహ‌రించిన స్వామి తిరుమ‌ల : తిరుమలలో పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *