కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సీఎం రేవంత్
హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ ను ఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేశారు. మెట్రో ఫేజ్-II డీపీఆర్ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II, ఫేజ్-III విస్తరణ సజావుగా సాగాలనే ఉద్దేశ్యంతోనే మెట్రో ఫేజ్-Iను L&TMRHLను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని కేంద్ర మంత్రికి వివరించారు అనుముల రేవంత్ రెడ్డి.
హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II ప్రాజెక్ట్ ను భారత ప్రభుత్వం – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ గా చేపట్టేందుకు త్వరగా ఆమోదం తెలపాలని కోరారు. కాగా హైదరాబాద్ నగర భవిష్యత్ అవసరాల దృష్ట్యా RGIఎయిర్పోర్ట్ – భారత్ ఫ్యూచర్ సిటీ కారిడార్ను మెట్రో ఫేజ్-IIIగా చేపట్టాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రికి వివరించడం జరిగిందన్నారు సీఎం. ఆయన కేంద్ర మంత్రితో కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మెట్రో ఫేజ్-III కి సంబంధించిన డీపీఆర్ ను కూడా ఇప్పటికే సమర్పించామని వెల్లడించారు.





