రైతుల ధాన్యానికి మెరుగైన ధ‌ర క‌ల్పించాలి

Spread the love

ఆదేశించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు వ్య‌వ‌సాయ రంగానికి సంబంధించి కీల‌క సూచన‌లు చేశారు. ఈసారి గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా సాగు నీటి రంగానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌ధానంగా రైతులు పండించిన ధాన్యానికి మెరుగైన ధ‌ర క‌ల్పిస్తామ‌న్నారు సీఎం. ఉద్యాన‌, వ్యవ‌సాయ రంగాల‌పై స‌మీక్ష చేప‌ట్టారు స‌చివాల‌యంలో. అరటి, ఆయిల్ పామ్, మిర్చి, కోకో లాంటి పంటలకు సంబంధించి ధరల సమస్య లేదని రైతులకు మంచి ధర లభిస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

సీజన్ కంటే ముందే రాష్ట్రంలోని నీటి వనరుల్లో ఫిష్ సీడ్ ను సరఫరా చేయాలని సీఎం స్పష్టం చేశారు. వచ్చే పంట సీజన్ కు 7.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. నాఫెడ్ నుంచి మినుములు ఇతర వాణిజ్య పంటల్ని కొనుగోలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రికి వివరించారు. పీఎండీఎస్ పథకం ద్వారా తక్కువ యూరియా వినియోగానికి ఇచ్చే ప్రోత్సాహకం పై కేంద్రంతో మాట్లాడాలని సీఎం వారికి సూచించారు. మదనపల్లె లో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు కానుందని సీఎం ప్ర‌క‌టించారు.

  • Related Posts

    టీవీకే చీఫ్ విజయ్ ని అభిమన్యుడిని చేశారు

    Spread the love

    Spread the loveపోసాని కృష్ణ ముర‌ళి సంచ‌ల‌న కామెంట్స్ హైద‌రాబాద్ : త‌మిళ‌నాడులో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు మ‌రింత ఉత్కంఠ‌ను రేపుతున్నాయి. ఎవ‌రు సీఎం అవుతార‌నే దానిపై ఇంకా స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ తీసుకునే నిర్ణ‌యంపై అంతా ఆస‌క్తితో…

    సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌నున్న విజ‌య్

    Spread the love

    Spread the loveత‌మిళ‌నాడు లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చెన్నై : త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చినా ప్ర‌భుత్వం ఏర్పాటులో ఇంకా అనిశ్చితి కొన‌సాగుతూనే ఉంది. 243 స్థానాల‌కు గాను 108 సీట్లు సాధించింది ఒంట‌రిగా టీవీకే విజ‌య్. మ‌రో వైపు డీఎంకే,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *