ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొణిదల సంచలన ప్రకటన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజక వర్గాల పునర్విభజన అధ్యయనానికి జనసేన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. డీ లిమిటేషన్ జరిగే అవకాశాలు ఉన్నందున ఈ రెండు ముఖ్యాంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేపట్టి పార్టీకి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ కమిటీలో సీనియర్ నాయకులు, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ , పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్, ఆరణి శ్రీనివాసులు గారు ( తిరుపతి), శ్రీ పంతం నానాజీ (కాకినాడ రూరల్), బొలిశెట్టి శ్రీనివాస్ (తాడేపల్లిగూడెం) లను నియమించారు పవన్ కళ్యాణ్.
వీరితో పాటు సీహెచ్ వంశీకృష్ణ గారు (విశాఖ సౌత్), మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను , ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవింద రావు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వెల్లడించారు పవన్ కళ్యాణ్ కొణిదల. ఇదిలా ఉండగా త్వరలోనే పార్టీ చీఫ్ నియమితులైన కమిటీ సభ్యులకు దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కొణిదల.






