ప్రిన్స్ యాద‌వ్ బౌలింగ్ అద్భుతం : విరాట్ కోహ్లీ

లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమిపై కామెంట్స్

ల‌క్నో : భార‌త క్రికెట్ జ‌ట్టు ఆట‌గాడు , ర‌న్ మెషీన్ గా పేరు పొందిన విరాట్ కోహ్లీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ల‌క్నో వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు ఓట‌మి పాలు కావ‌డంపై స్పందించాడు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఇరు జ‌ట్లు గెలుపు కోసం శ్ర‌మించాయ‌ని, మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా సాగింద‌న్నాడు. అయితే ల‌క్నో మాకంటే మ‌రింత మెరుగ్గా ఆడింద‌ని కితాబు ఇచ్చాడు. నిజం చెప్పాలంటే, ఇది చాలా మంచి, పోటీతో కూడిన మ్యాచ్. ఇరు జట్లు తమ వంతు ఉత్తమంగా ప్రయత్నించాయి, కానీ మ్యాచ్ గెలిచినందుకు ఎల్‌ఎస్‌జికి అభినందనలు తెలియ చేస్తున్నా.

నేను ప్రత్యేకంగా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ బౌల‌ర్ ప్రిన్స్ యాదవ్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను, అతను చాలా బాగా బౌలింగ్ చేసి కొన్ని అద్భుతమైన బంతులు వేశాడని ప్ర‌శంస‌లు కురిపించాడు విరాట్ కోహ్లీ. భవిష్యత్తులో అతను ఇంకా మెరుగ్గా రాణిస్తాడని ఆశిస్తున్నానని అన్నాడు. కాగా పదేపదే వికెట్లు కోల్పోతున్నప్పటికీ, మా బ్యాటర్లు పోరాడి నిలబడిన తీరు, చూపిన పట్టుదల నిజంగా అద్భుతం అన్నాడు. రాబోయే మ్యాచ్‌లలో మేము మరింత మెరుగ్గా ఆడి తదుపరి దశకు అర్హత సాధిస్తామనే న‌మ్మ‌కం త‌మ‌కు ఉంద‌న్నాడు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *