లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమిపై కామెంట్స్
లక్నో : భారత క్రికెట్ జట్టు ఆటగాడు , రన్ మెషీన్ గా పేరు పొందిన విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓటమి పాలు కావడంపై స్పందించాడు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఇరు జట్లు గెలుపు కోసం శ్రమించాయని, మ్యాచ్ రసవత్తరంగా సాగిందన్నాడు. అయితే లక్నో మాకంటే మరింత మెరుగ్గా ఆడిందని కితాబు ఇచ్చాడు. నిజం చెప్పాలంటే, ఇది చాలా మంచి, పోటీతో కూడిన మ్యాచ్. ఇరు జట్లు తమ వంతు ఉత్తమంగా ప్రయత్నించాయి, కానీ మ్యాచ్ గెలిచినందుకు ఎల్ఎస్జికి అభినందనలు తెలియ చేస్తున్నా.
నేను ప్రత్యేకంగా లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను, అతను చాలా బాగా బౌలింగ్ చేసి కొన్ని అద్భుతమైన బంతులు వేశాడని ప్రశంసలు కురిపించాడు విరాట్ కోహ్లీ. భవిష్యత్తులో అతను ఇంకా మెరుగ్గా రాణిస్తాడని ఆశిస్తున్నానని అన్నాడు. కాగా పదేపదే వికెట్లు కోల్పోతున్నప్పటికీ, మా బ్యాటర్లు పోరాడి నిలబడిన తీరు, చూపిన పట్టుదల నిజంగా అద్భుతం అన్నాడు. రాబోయే మ్యాచ్లలో మేము మరింత మెరుగ్గా ఆడి తదుపరి దశకు అర్హత సాధిస్తామనే నమ్మకం తమకు ఉందన్నాడు.





