త‌ప్ప‌కుండా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాం

Spread the love

ధీమా వ్య‌క్తం చేసిన స్టాండింగ్ కెప్టెన్ జైస్వాల్

జైపూర్ : రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్టాండింగ్ కెప్టెన్ య‌శ‌స్వి జైస్వాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా జైపూర్ స‌వాయి మాన్ సింగ్ స్టేడియంలో జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ఊహించ‌ని విధంగా భారీ తేడాతో ఓటమి పాలైంది ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో. రెగ్యుల‌ర్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్ ఈ మ్యాచ్ కు దూరం కావ‌డంతో త‌న స్థానంలో జైశ్వాల్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించారు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 229 ప‌రుగులు చేసింది. అనంత‌రం 230 ర‌న్స్ ను ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు 16.3 ఓవ‌ర్ల‌లో 152 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఈ జ‌ట్టులో ర‌వీంద్ర జ‌డేజా 38 ర‌న్స్ చేయ‌గా వైభ‌వ్ సూర్య‌వంశీ 36 ప‌రుగులు చేశారు. మిగ‌తా ఆటగాళ్లు ఎవ‌రూ ఆశించిన మేర రాణించ‌లేదు.

మ్యాచ్ అనంత‌రం య‌శ‌స్వి జైస్వాల్ మీడియాతో మాట్లాడారు. రియాన్ పూర్తి ఫిట్‌నెస్‌తో లేకపోవడం వల్లే తాను ఇక్కడ ఉన్నాను. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, మనందరికీ తెలిసినట్లే… కొన్ని రోజులు మనకు అన్నీ కలిసొస్తాయని భావించామ‌న్నారు. మరికొన్ని రోజులు మనం అనుకున్న రీతిలో బౌలింగ్ చేయలేక పోవచ్చ‌ని అన్నారు జైస్వాల్. ఇక రియాన్ ప‌రాగ్ జట్టు కోసం చాలా అద్భుతంగా రాణిస్తున్నాడని అన్నాడు. మరింత బలంగా పుంజుకుని తిరిగి వస్తాడని నేను భావిస్తున్నట్లు తెలిపాడు.

  • Related Posts

    ఐపీఎల్ లో చ‌రిత్ర సృష్టించిన వైభ‌వ్ సూర్య‌వంశీ

    Spread the love

    Spread the loveఅతి త‌క్కువ స‌మ‌యంలో ఏకంగా 100 సిక్స‌ర్లు జైపూర్ : రాహుల్ ద్ర‌విడ్ ఏ ముహూర్తాన త‌న‌ను తీసుకున్నాడో కానీ వండ‌ర్స్ క్రియేట్ చేస్తున్నాడు అత్యంత పిన్న వ‌య‌సు క‌లిగిన వైభ‌వ్ సూర్య‌వంశీ. త‌ను వ‌చ్చీ రావ‌డంతోనే దుమ్ము…

    తిప్పేసిన ర‌షీద్ ఖాన్ త‌ల‌వంచిన రాజ‌స్తాన్

    Spread the love

    Spread the love4 ఓవ‌ర్లు 33 ప‌రుగులు 4 కీల‌క వికెట్లు జైపూర్ : ఐపీఎల్ మెగా టోర్న‌మెంట్ లో భాగంగా జైపూర్ లోని స‌వాయి మాన్ సింగ్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో గిల్ సార‌థ్యంలోని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *