సలహాదారుడిగా రాధన్ పండిట్
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఆయన ప్రముఖ జ్యోతిష్కుడిగా పేరు పొందిన రాధన్ పండిట్ ను ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. ఇక పండిట్ కు సంపన్నుల జ్యోతిష్కుడిగా పేరుంది. దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న రథాన్ పండిట్ ను ప్రభుత్వ సలహాదారుగా నియమించడం పట్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా సీఎం సూచనల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే సీఎంగా కొలువు తీరిన వెంటనే విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు కలకలం రేపుతున్నాయి. మరికొన్ని వివాదాలకు దారి తీస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆయనకెందుకు ప్రభుత్వ పదవి అంటూ అప్పుడే మొదలైన విమర్శలు సోషల్ మీడియా వేదికగా. కాగా విజయ్ పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందని ఎప్పుడో చెప్పారు రధాన్ పండిట్. తన సూచనలు పాటిస్తూ రాజకీయాల్లో అడుగులు వేశారు. మరో వైపు తన పార్టీకి సోషల్ మీడియా క్యాంపెయిన్ చేసింది ప్రశాంత్ కిషోర్. మొత్తంగా విజయ్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది.





