సీఎం జోసెఫ్ సంచ‌ల‌న నిర్ణ‌యం

స‌ల‌హాదారుడిగా రాధ‌న్ పండిట్

చెన్నై : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న ప్ర‌ముఖ జ్యోతిష్కుడిగా పేరు పొందిన రాధ‌న్ పండిట్ ను ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడిగా నియ‌మించారు. ఇక పండిట్ కు సంపన్నుల జ్యోతిష్కుడిగా పేరుంది. దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న రథాన్ పండిట్ ను ప్రభుత్వ సలహాదారుగా నియమించడం ప‌ట్ల తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. తాజాగా సీఎం సూచ‌న‌ల మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

అయితే సీఎంగా కొలువు తీరిన వెంట‌నే విజ‌య్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. మ‌రికొన్ని వివాదాల‌కు దారి తీస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా ఆయనకెందుకు ప్రభుత్వ పదవి అంటూ అప్పుడే మొదలైన విమర్శలు సోష‌ల్ మీడియా వేదిక‌గా. కాగా విజయ్ పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందని ఎప్పుడో చెప్పారు ర‌ధాన్ పండిట్. త‌న సూచనలు పాటిస్తూ రాజకీయాల్లో అడుగులు వేశారు. మ‌రో వైపు త‌న పార్టీకి సోష‌ల్ మీడియా క్యాంపెయిన్ చేసింది ప్ర‌శాంత్ కిషోర్. మొత్తంగా విజ‌య్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటారోన‌ని ఉత్కంఠ నెల‌కొంది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *