ఇళ్ల కేటాయింపు కోసం ప్రత్యేక డ్రైవ్

Spread the love

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి పొంగులేటి

హైద‌రాబాద్ : రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.
2 BHK ఇళ్ల కేటాయింపు కోసం యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పూర్తయిన ఇళ్లతో పాటు వివిధ నిర్మాణ దశలలో ఉన్న ఇళ్ల లబ్ధిదారులను ఈ నెలాఖరులోగా గుర్తించాలని ఆయన స్ప‌ష్టం చేశారు. కాలనీల నుండి 5 నుండి 8 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారిని మాత్రమే ఎంపిక చేయాలని కీల‌క సూచ‌న‌లు చేశారు. ఇప్పటికే పూర్తయిన ఇళ్లలో లబ్ధిదారులు నివసించేలా చూడాలని, అలాగే ఈ కాలనీలలో తాగునీరు, మురుగునీటి పారుదల, విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాల కల్పనను వేగవంతం చేయాలని ఆదేశించారు.

హైదరాబాద్ పరిధిలో గృహ స్థలాలు ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలను పంపిణీ చేయాలని అన్నారు. ఇదిలా ఉండ‌గా ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల‌కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. ఇదే స‌మ‌యంలో వ‌చ్చే జూన్ 2న రెండో ద‌శ ఇళ్ల నిర్మాణానికి శ్రీ‌కారం చుట్ట‌నున్న‌ట్లు తెలిపారు . తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇళ్లు పొంద‌ని వారికి తీపిక‌బురు చెప్పారు. ఈ సంద‌ర్బంగా ఇళ్ల ల‌బ్దిదారులు ముందుగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరారు.

  • Related Posts

    హాస్ట‌ల్స్ కోసం ర‌రూ. 110 కోట్లు చెల్లింపు

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి ఎస్. స‌విత అమ‌రావ‌తి : వచ్చే ఏడాది మరో 10 కొత్త గురుకుల పాఠశాలలను ప్రారంభించనున్నామ‌ని ప్ర‌క‌టించారు మంత్రి ఎస్. స‌విత‌. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవించాలని సూచించారు. సమస్యలు…

    బండి భ‌గీర‌థ్ బెయిల్ దావాపై హైకోర్టు విచార‌ణ

    Spread the love

    Spread the loveపోక్సో కేసులో నోటీసులు పంపించిన పోలీసులు హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కొడుకు బండి భ‌గీర‌థ్ పోక్సో కేసు. ఈ కేసులో దర్యాప్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో వైపు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *