యువతకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్న చంద్రబాబు
అమరావతి : అమరావతి అభివృద్ధిలో భాగస్వామి అయ్యేందుకు ముందుకొచ్చిన బైసర్ను, కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్రావును అభినందిస్తున్నట్లు తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. విద్య, వైద్యంలో తిరుగులేని స్థాయిలో ఉండేలా 25 కిమ్స్ ఏర్పాటువుతోందన్నారు. మెడికల్ కాలేజీ, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి లక్ష మందికి నైపుణ్యం అందించేలా సంస్థ ఎదగనుందన్నారు. 500 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోందని చెప్పారు. 250 మెడికల్ సీట్లు, 1,000 నాన్ మెడికల్ సీట్లు, మరో 1,000 మంది ట్రైనీలు తయారు కావాలన్నారు. డెంటల్, ఫిజియో థెరపీ వంటి సుమారు 5,000 మందిని నియమించుకునే అవకాశం ఉందన్నారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైద్యులతో పాటు నర్సులు, పారామెడికల్ సిబ్బంది టెక్నీషియన్లు చాలా అవసరం ఉందన్నారు. డాక్టర్లు కూడా ఏఐ నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు సీఎం.
గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు రాష్ట్రంలో విధ్వంసం జరిగిందన్నారు. ఆయన మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. అలాంటి అరాచక పాలన నా జీవితంలో చూడలేదన్నారు. నేను పిల్లల భవిష్యత్ మాత్రమే చూస్తాను. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనేది నా ఆలోచన అని ప్రకటించారు. ఇటీవలే గూగుల్ డేటా సెంటర్కు భూమి పూజ చేసుకున్నాం. 2028 ఆగస్ట్ కి ముందే నిర్మాణం పూర్తి చేసి ఆపరేషన్ ప్రారంభించాలని సూచించాను. ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేశాం. 2028 డిసెంబర్కు ఫేజ్ 1 సిద్ధం అవుతుంది.





