యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్న సీఎం
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సైబర్ నేరాల నియంత్రణకు తక్షణమే యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. సచివాలయంలో సైబర్ ఫ్రాడ్ , సెక్యూరిటీపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా పలు సూచనలు చేశారు. పిషింగ్, విషింగ్, క్రెడిట్, డెబిట్ కార్డు మోసాలు, ఆన్ లైన్ లోన్ ఫ్రాడ్స్ సహా డిజిటల్ అరెస్టుల్లో బాధితులు సొమ్మును కోల్పోతున్నట్టు డిజీపీ తెలిపారు. సైబర్, ఆర్ధిక నేరాల నియంత్రణ కోసం రాష్ట్ర స్థాయిలో సీఐడీ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ పని చేస్తోందని చెప్పారు.
అంతే కాకుండా విజయవాడ, విశాఖ, తిరుపతిలలో సైబర్ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రికి వివరించారు. మరోవైపు ఏపీలో సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా డేటాకు రక్షణ కల్పిస్తున్నామని ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ సీఎంకు వివరించారు. ఈ సమీక్షకు మంత్రి పయ్యావుల కేశవ్, హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, ఏపీ ఫోరెన్సిక్స్ సలహాదారు కెపీసీ గాంధీ, రిజర్వు బ్యాంకు సహా వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరయ్యారు.





