పలు అంశాలపై ఇరువురు నేతలు కీలక చర్చలు
యూఏఈ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం యూఏఈకి చేరుకున్నారు, పంచ దేశాల పర్యటన ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా మోదీకి యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు. అబుదాబికి చేరుకున్న అనంతరం ప్రధాని మోదీకి గౌరవ వందనం సమర్పించారు. యూఏఈలో అడుగు పెట్టిన మోదీ సంతోషానికి లోనయ్యారు. నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలతో కూడిన పంచదేశాల పర్యటన ప్రారంభమైంది. మోదీ మధ్యాహ్నం అబుదాబిలో దిగారు.
అక్కడ యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆయనకు స్వాగతం పలికారు. చేరుకున్న అనంతరం ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అబుదాబిలో తన బస సమయంలో, మోదీ అధ్యక్షుడితో చర్చలు జరపనున్నారు. ఈ చర్చలు భారత్-యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, పశ్చిమ ఆసియాలో వేగంగా మారుతున్న పరిస్థితులపై కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. చమురు సరఫరాలు, సముద్ర వాణిజ్య మార్గాలపై ఆందోళనల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న అస్థిరతను భారత్ పర్యవేక్షిస్తున్నందున, ఇంధన భద్రత చర్చలలో ప్రధానాంశంగా ఉండే అవకాశం ఉంది.





