కెప్టెన్ గా హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ
ముంబై : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. శ్రీలంకలో పర్యటించి భారత -ఎ – జట్టు ను ప్రకటించింది. శ్రీలంకలో జరిగే ముక్కోణపు సిరీస్కు ఐపీఎల్ లో దుమ్ము రేపుతూ సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తున్న వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేసింది. ఈ ముక్కోణపు సిరీస్లో ఆతిథ్య శ్రీలంక A, ఇండియా A , ఆఫ్ఘనిస్తాన్ A జట్లు తలపడతాయి. ఈ టోర్నీ జూన్ లో జరగనుంది . ఈ పరిమిత ఓవర్ల ముక్కోణపు సిరీస్ ముగిసిన తర్వాత, ఇండియా A జట్టు శ్రీలంక Aతో రెండు బహుళ-రోజుల (multi-day) మ్యాచ్లను కూడా ఆడనుంది; ఈ ‘రెడ్-బాల్’ మ్యాచ్ల కోసం జట్టును తర్వాతి తేదీలో ప్రకటిస్తారు.
ఇదిలా ఉండగా ఈ ‘వైట్-బాల్’ సిరీస్ దంబుల్లాలో జరుగుతుంది, కాగా బహుళ-రోజుల మ్యాచ్లు గాలేలో జరుగుతాయి. ముక్కోణపు సిరీస్ కోసం ఇండియా A జట్టుకు హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ఇక జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. జట్టు పరంగా చూస్తే తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బడోని, నిశాంత్ సింధు, హర్ష్ దూబే, సూర్యాంష్ షెడ్గే, ప్రభ్సిమ్రన్ సింగ్ (WK), కుమార్ కుశాగ్ర (WK), విప్రాజ్ నిగమ్, యష్ ఠాకూర్, యుద్ధవీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్ ఆడనున్నారు.






