గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన విద్యారణ్య పీఠాధిపతి

శుక్లాను ఆశీర్వ‌దించిన విరూపాక్ష స్వామీజీ

హైద‌రాబాద్ : హంపి విరూపాక్ష విద్యార‌ణ్య పీఠాధిప‌తి విద్యార‌ణ్య భార‌తి స్వామీజీ మ‌ర్యాద పూర్వ‌కంగా తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శివ ప్ర‌తాప్ శుక్లాను క‌లుసుకున్నారు. హైద‌రాబాద్ లోని లోక్ భ‌వ‌న్ లో చాలా సేపు వీరిద్ద‌రూ వివిధ అంశాల‌పై చ‌ర్చించారు. స్వామీజీ ప్ర‌త్యేకంగా గ‌వ‌ర్న‌ర్ తో స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. స్వామీజీకి ఘ‌న స్వాగ‌తం ప‌లికాయి గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం వ‌ర్గాలు.

ఆధ్యాత్మిక, సామాజిక అంశాలపై గవర్నర్‌తో చర్చించారు విద్యార‌ణ్య భార‌తి స్వామీజీ. స‌నాత‌న హిందూ ధ‌ర్మం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించిన‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ కొలువు తీరాక స్వామీజీల హ‌వా కొన‌సాగుతోంది. రాజ్యాంగ బ‌ద్ద‌మైన ప‌ద‌వుల‌లో ఉన్న వారు అన్ని కులాలు, వ‌ర్గాలు, జాతుల ప‌ట్ల స‌మ దృష్టిని క‌లిగి ఉండాల‌ని డాక్ట‌ర్ బాబా సాహెబ్ రాసిన రాజ్యాంగం చెబుతుంది. అవేవీ ఇక్క‌డ అమ‌లు కావ‌డం లేదు.

  • Related Posts

    శ్రీ పల్లికొండేశ్వర స్వామిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్

    తిరుప‌తి : తిరుపతి జిల్లా సురుటుపల్లిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు దంపతులు సోమవారం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీ పద్మనాభరాజు, కార్యనిర్వహణాధికారి…

    కళల పరిరక్షణకు టీటీడీ నిరంతర ప్రోత్సాహం

    తిరుప‌తి : తిరుపతి ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా భారతీయ కళలు, సంస్కృతికి నిలయమని, కళలను పరిరక్షించి ప్రోత్సహించే ప్రతి సంస్థకు టీటీడీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను అని తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతిలోని మహతి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *