న్యూఢిల్లీ : పరీక్షల నిర్వహణలో జరిగినట్లు ఆరోపించబడుతున్న అక్రమాలపై జవాబుదారీతనం కోసం డిమాండ్ చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ గత 25 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు తన త్యాగం స్ఫూర్తిని ఇచ్చిందని పేర్కొంటూ, తన నిరాహార దీక్షను విరమించాలని ‘కాక్రోచ్ జనతా పార్టీస సోనం వాంగ్చుక్ను కోరింది. అలాగే, పరీక్షల అక్రమాలపై జరుగుతున్న ఈ పోరాటం తమ డిమాండ్లు నెరవేరే వరకు కొనసాగుతుందని పార్టీ హామీ ఇచ్చింది. వాంగ్చుక్కు రాసిన బహిరంగ లేఖలో పరీక్షల విషయంలో న్యాయం కోసం సాగుతున్న ఉద్యమాన్ని తాము ముందుకు తీసుకు వెళ్తామని చెబుతూనే, తన ఆరోగ్యంపై దృష్టి సారించాలని కోరింది.
దయచేసి మీ దీక్షను విరమించ వలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. మీ త్యాగం దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చింది అని ఆ లేఖ పేర్కొంది.ఈ పోరాటం ఏ ఒక్క వ్యక్తికంటే గొప్పదని, విద్యార్థులకు న్యాయం దక్కాలని మీరు నిరూపించారు. కానీ ప్రస్తుతం, మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మాకు ముఖ్యం అని ఆ పార్టీ తెలిపింది. దీక్ష విషయంలో వాంగ్చుక్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఈ ఉద్యమం మాత్రం కొనసాగుతుందని ఆ సంస్థ హామీ ఇచ్చింది. మీ దీక్ష ముగిసినంత మాత్రాన ఈ పోరాటం ఆగిపోదని మేము హామీ ఇస్తున్నాం. మేము నిరసనలను కొనసాగిస్తామని ప్రకటించారు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే.






