పీఎండీఎస్ ద్వారా రైతులకు విస్తృత సూచనలు

అమ‌రావ‌తి : రైతు సాధికార సంస్థ–పీఎండీఎస్ కింద 23 లక్షల మంది రైతులు, 25 లక్షల ఎకరాల లక్ష్యానికి గాను, ఇప్పటివరకు 14.82 లక్షల మంది రైతులు అంటే 67 శాతం, 16.67 లక్షల ఎకరాలు అంటే 64 శాతం లక్ష్యాన్ని సాధించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పెల్లెటైజ్డ్ పీఎండీఎస్ కింద 4.19 లక్షల మంది రైతులు అంటే 28 శాతం, 4.20 లక్షల ఎకరాలు అంటే 25 శాతం పురోగతి నమోదైందన్నారు. అంతరకృషి, ఆకులపై ఎరువుల పిచికారీ, నేలలో తేమ సంరక్షణ, పంట పొలాల సరిహద్దుల్లో పంటల సాగుకు సంబంధించి రైతులకు 1.68 కోట్ల సూచనలు జారీ చేశామని మంత్రి తెలిపారు.

కందులు, పెసలు, కొర్రలు, మినుములు, నువ్వులకు సంబంధించిన 14,078 క్వింటాళ్ల అత్యవసర ప్రత్యామ్నాయ విత్తనాలను ఏపీ స్టేట్ సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా సిద్ధం చేశామని చెప్పారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు అచ్చెన్నాయుడు. వరి పంట నుంచి ఇతర పంటలకు మార్పిడి చేయడానికి నిర్దేశించిన 1.29 లక్షల హెక్టార్ల లక్ష్యానికి గాను, ఇప్పటివరకు 11,422 హెక్టార్లు అంటే 9 శాతం మాత్రమే సాధించామని మంత్రి తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

  • Related Posts

    మొబైల్ ఫోన్ల వినియోగంపై సింగరేణి నిషేధం

    క‌రీంన‌గ‌ర్ జిల్లా : సింగ‌రేణి బొగ్గు గ‌నుల సంస్థ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. బొగ్గు గనుల్లో ప‌ని చేసే కార్మికులు మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించిన‌ట్లు వెల్ల‌డించింది. భద్రతా కారణాలు, పని ప్రదేశాల్లో కార్మికులు ‘రీల్స్’ (చిన్న వీడియోలు) చిత్రీకరించే…

    ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై ప్రచారం చేప‌ట్టాలి

    అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు ఏవైనా సందేహాలు ఉంటే నాయకులు వాటిని నివృత్తి చేయాలన పేర్కొన్నారు. ప్రజలతో మమేకమయ్యే ఇంటింటికీ ప్ర‌చార‌ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని ముఖ్యమంత్రి మంత్రులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *