ఎస్వీ మ్యూజియం పనులను వేగవంతం చేయాలి

తిరుమల : తిరుమ‌ల లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి మ్యూజియం అభివృద్ధి పనులను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు అడిష‌న‌ల్ కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి వెంక‌య్య చౌద‌రి. త్వ‌ర‌లో స్వామి వారి వేదిక‌గ‌గా శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క సూచ‌న‌లు చేశారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లోపు వేగవంతంగా పూర్తి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఎస్వీ మ్యూజియంలో ఏర్పాటు చేసిన గ్యాలరీలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. మ్యూజియంలోని గ్యాలరీలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం మ్యూజియం బయట పార్కింగ్, మైబైల్ కౌంటర్లు, పాద రక్షకాలు భద్రపరచే కేంద్రాల ఏర్పాటు గురించి పలు సూచనలు చేశారు ఏఈవో వెంక‌య్య చౌద‌రి. ఈ పరిశీలనా కార్యక్రమంలో టీటీడీ హెల్త్ డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, ఎస్ఈ వేణు గోపాల్, ఎలక్ట్రికల్ డిఈ చంద్ర శేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండ‌గా తిరుమ‌లకు భారీ ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు శ్రీ‌వారి భ‌క్త బాంధ‌వులు. ఈ సంద‌ర్బంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి (టిటిడి).

  • Related Posts

    సింహాచ‌లం గిరి ప్రదక్షిణ‌కు పోటెత్తిన భ‌క్తులు

    విశాఖ‌ప‌ట్నం జిల్లా : విశాఖ జిల్లా లోని ప్ర‌ముఖ పుణ్యక్షేత్రం సింహాచ‌లం కు పోటెత్తారు భ‌క్తులు. 32 కి.మీ. గిరి ప్రదక్షిణకు భక్తుల భారీగా తరలి వచ్చారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా జరిగే ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవంలో పాల్గొనేందుకు…

    ఆగస్టు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

    తిరుమల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి (టిటిడి) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వ‌చ్చే ఆగ‌స్టు నెల‌లో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు వెల్ల‌డించింది. ఆగస్టు 14న తిరుమల శ్రీవారు పురిశైవారితోటకు వేంచేపు చేస్తారు. 16న నాగ చతుర్థి,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *