ఆగస్టు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

తిరుమల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి (టిటిడి) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వ‌చ్చే ఆగ‌స్టు నెల‌లో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు వెల్ల‌డించింది. ఆగస్టు 14న తిరుమల శ్రీవారు పురిశైవారితోటకు వేంచేపు చేస్తారు. 16న నాగ చతుర్థి, కశ్యప మహర్షి వర్ష తిరు నక్షత్రం చేప‌డ‌తారు. 17న గరుడ పంచమి, శ్రీవారి గరుడ వాహన సేవ జ‌రుగుతుంద‌ని తెలిపింది టీటీడీ. 21న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి, 22న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపింది.

ఇక‌ ఆగస్టు 25న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల సమాప్తి అవుతాయ‌ని పేర్కొంది టీటీడీ. 28న శ్రావణ పౌర్ణమి, శ్రీవారి గరుడ వాహన సేవ, శ్రీ విఖన సమహాముని జయంతి, శ్రీ హయగ్రీవ జయంతి ఉంటుంద‌ని తెలిపింది. 29న తిరుమల శ్రీవారు విఖనసాచార్యుల వారి సన్నిధికి వేంచేపు చేస్తార‌ని పేర్కొంది. ఈ సంద‌ర్బంగా తిరుమ‌ల‌కు విచ్చే భ‌క్తులు ఆయా తేదీల వారీగా త‌మ ద‌ర్శ‌నం కోసం ఏర్పాట్లు చేసుకోవాల‌ని సూచించింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి . విశేష ప‌ర్వ‌దినాల స‌మ‌యంలో స్వామి వారికి విశేష పూజ‌లు నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌న్నారు ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌.

  • Related Posts

    సింహాచ‌లం గిరి ప్రదక్షిణ‌కు పోటెత్తిన భ‌క్తులు

    విశాఖ‌ప‌ట్నం జిల్లా : విశాఖ జిల్లా లోని ప్ర‌ముఖ పుణ్యక్షేత్రం సింహాచ‌లం కు పోటెత్తారు భ‌క్తులు. 32 కి.మీ. గిరి ప్రదక్షిణకు భక్తుల భారీగా తరలి వచ్చారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా జరిగే ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవంలో పాల్గొనేందుకు…

    క‌పిలేశ్వ‌ర ఆల‌యంలో ఘ‌నంగా గ్రంధి పవిత్ర సమర్పణ

    తిరుప‌తి : తిరుపతి లోని శ్రీ క‌పిలేశ్వ‌ర స్వామి ప‌విత్రోత్స‌వాలు అత్యంత వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఈసంద‌ర్భంగా భారీ ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు. ఇదే క్ర‌మంలో ఏ ఒక్క భ‌క్తుడికి ఇబ్బంది లేకుండా చేస్తోంది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *