గిగ్, ప్లాట్ ఫామ్ కార్మికుల కోసం పొదుపు ఖాతా

హైద‌రాబాద్ : గిగ్ , ప్లాట్‌ఫామ్ కార్మికుల కోసం ఇండియన్ బ్యాంక్ ఇండీ-గిగ్ చాంపియన్ పొదుపు ఖాతాను గురువారం ప్రారంభించింది. తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టిజిపిడబ్ల్యూ యు )తో పైలట్ కార్యక్రమం కింద దీనిని స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా యాప్ ఆధారిత ఆటో, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ కార్మికులు, ఫ్రీలాన్సర్లు , ఇతర డిజిటల్ వర్క్‌ఫోర్స్ భాగస్వాములతో సహా గిగ్ , ప్లాట్‌ఫామ్ కార్మికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన “ఇండీ-గిగ్ చాంపియన్” అనే ప్రత్యేక బ్యాంకింగ్ ఉత్పత్తిని ఇండియన్ బ్యాంక్ ప్రవేశపెట్టింది.

గిగ్ కార్మికుల ఆర్థిక చేరికకు మద్దతుగా ఎఫ్జీఎం రామచంద్ర బాబు, హైదరాబాద్ జోనల్ మేనేజర్ కె. శ్రీనివాస్, ఆర్ అండ్ జీఆర్ హెడ్ కె. శేఖర్ బాబు , తెలంగాణ గిగ్ , ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టిజిపిడబ్ల్యూ యు) వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మార్గదర్శకత్వంలో ఇండియన్ బ్యాంక్ ఒక పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో ఉన్న టీజీపీడబ్ల్యూయూ కార్యాలయంలో ఈరోజు మొదటి 100 పొదుపు ఖాతాలు తెరిచారు. మరిన్ని వేల మంది కార్మికులకు ఈ ప్రయోజనాలను విస్తరించడానికి త్వరలో ఒక పెద్ద ఎత్తున ఖాతా తెరిచే శిబిరం నిర్వహించనున్న‌ట్లు ఈ సంద‌ర్బంగా వెల్ల‌డించారు షేక్ స‌లావుద్దీన్.

ఈ పొదుపు ఖాతా వ‌ల్ల గిగ్, ప్లాట్ ఫామ్ కార్మికుల‌కు ఎంతో మేలు చేకూర‌నుంది. ఈ ఇండీ-గిగ్ ఛాంపియన్ పొదుపు ఖాతా ద్వారా ఉచిత జీరో-బ్యాలెన్స్ తో పాటు అర్హులైన గిగ్ , ప్లాట్‌ఫామ్ కార్మికులకు రూ. 5,00,000 వరకు ఉచిత గ్రూప్ వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజ్ అందుతుంది. సురక్షితమైన, సౌకర్యవంతమైన ,పూర్తి డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వ‌స్తాయ‌ని తెలిపారు స‌లావుద్దీన్. బ్యాంకు అధికారులు మాట్లాడుతూ గిగ్ , ప్లాట్‌ఫామ్ కార్మికుల జీవనోపాధికి మద్దతునిచ్చే, అందుబాటులో ఉండే, సురక్షితమైన , సమ్మిళిత బ్యాంకింగ్ సేవలను అందించడం ద్వారా వారి ఎదుగుదలలో ఆర్థిక భాగస్వామిగా నిలవడం మా బాధ్యత అని పేర్కొన్నారు.

గిగ్ , ప్లాట్‌ఫామ్ కార్మికుల ఆర్థిక భద్రత దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు షేక్ స‌లావుద్దీన్. ఉచిత జీరో-బ్యాలెన్స్ పొదుపు ఖాతాతో పాటు 5 లక్షల ప్రమాద బీమా కవరేజ్ ఎంతో అవసరమైన రక్షణను అందించి, మరింత ఆర్థిక సమ్మిళితాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. గిగ్ కార్మికుల అవసరాలను గుర్తించి, ఈ ముఖ్యమైన చొరవలో టిజిపిడబ్ల్యూ యు తో భాగస్వామ్యం అయినందుకు ఇండియన్ బ్యాంక్‌కు తాము ద‌న్య‌వాదాలు తెలియ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

  • Related Posts

    సమీర్ వాంఖడేకు ముంబై హైకోర్టు బిగ్ రిలీఫ్

    ముంబై : NCB విచారణ నుండి సమీర్ వాంఖడేకు ముంబై హైకోర్టు మధ్యంతర ఉపశమనం క‌లిగింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన కేసుతో సహా రెండు డ్రగ్స్ కేసులలోని అక్రమాలపై ఎన్సీబీ విచారణ చేపట్టింది. రెండు కేసులలోని అక్రమాల…

    కడెం ప్రాజెక్ట్ ఆరు గేట్ల ఎత్తివేత

    నిర్మ‌ల్ జిల్లా : ఎగువ‌న కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా నీటి వ‌ర‌ద కొన‌సాగుతోంది. దీంతో ఆయా ప్రాజెక్టులు నిన్న‌టి దాకా వెల వెల బోతుండ‌గా ఇవాళ ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల తాకిడికి వ‌ర‌ద ఉధృతి అంత‌కంత‌కూ పెరుగుతూ వ‌స్తోంది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *