సంస్కృతి ఉట్టి పడేలా భోగాపురం విమానాశ్రయం

విశాఖపట్నం జిల్లా : తెలుగు సంస్కృతి ఉట్టి ప‌డేలా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం త‌యారైంది. కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి దీనిని స‌ర్వాంగ సుంద‌రంగా నిర్మించారు. ఇవాళ దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో పాటు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఎయిర్ పోర్టును ప్రారంభించారు. జాతికి అంకితం చేశారు. ఈ విమానాశ్రయాన్ని ఏవియేషన్, ఏరోస్పేస్ హబ్ గా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు ఈ సంద‌ర్బంగా సీఎం. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. తెలుగు కళలు, సంస్కృతీ వారసత్వ వైభవాన్ని చాటేలా విమానాశ్రయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతీ, సంప్రదాయాలు, కళలు ఉట్టిపడేలా అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అలంకరించారు.

విమానాశ్రయ స్వాగత ద్వారం వద్ద ఆకట్టుకునేలా భారీ స్థాయి ఏటికొప్పాక కళాకృతి ఏర్పాటు చేశారు. విమానాశ్రయ ప్రాంగణం లోపల ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి అద్దం పట్టేలా తోలు బొమ్మలు, బొబ్బిలి వీణ, నాదస్వరం, లేపాక్షి నంది చిత్రాలతో పాటు భౌగోళిక వారసత్వాన్ని చాటే బంగినపల్లి మామిడి లాంటి చిత్రాలను అలంకరించారు. ప్రత్యేకించి ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు 13,500 మంది గిరిజన మహిళలతో థింసా నృత్యంతో. విమానాశ్రయంలో దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ డిస్ప్లే వాల్ ఏర్పాటు చేశారు. . విమానాల రాకపోకలు, సర్వీసుల వివరాలు తెలియ చేసేలా ప్రయాణికుల కోసం ఎల్ఈడీ వాల్ ను ఏర్పాటు చేయ‌డం ఎయిర్ పోర్టులో ప్ర‌త్యేక‌త‌.

  • Related Posts

    మెటా ఇండియా ఎఫెక్ట్ ..డీజీపీ ఆఫీస్ కు డీసీపీ అటాచ్

    హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది మెటా ఇండియా హెడ్ పై హైద‌రాబాద్ పోలీసులు కేసు న‌మోదు చేయ‌డం. మెటా ఇండియా అధిపతిపై నమోదైన కేసులో నగర సైబర్ క్రైమ్ డీసీపీ కోసం గాలింపు ప్రారంభం అయ్యింది. ప్ర‌ధాన మంత్రి…

    హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు 5 అక్రిడిటేషన్

    హైద‌రాబాద్ : ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) నిర్వహించే ‘ఎయిర్‌పోర్ట్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అక్రిడిటేషన్ ప్రోగ్రామ్’ కింద ప్రతిష్టాత్మకమైన లెవెల్ 5 అక్రిడిటేషన్‌ను సాధించడం ద్వారా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక ప్రధాన అంతర్జాతీయ గుర్తింపును పొందింది. ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *