పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ‌ధామం తెలంగాణ రాష్ట్రం

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చాక కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. పెట్టుబ‌డులు పెట్టేందుకు త‌మ రాష్ట్రం స్వ‌ర్గధామంగా ఉంద‌న్నారు . ఈరోజు నేను పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక వృద్ధి, నైపుణ్యాభివృద్ధి , తెలంగాణ ఆర్థిక పరివర్తనపై చర్చించడానికి సీఐఐ (CII) ప్రతినిధులతో సమావేశమ‌య్యారు. పారదర్శక పాలన, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు, వేగవంతమైన అనుమతుల ద్వారా తెలంగాణను భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి త‌మ‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.

ఏఐ (AI) ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్న తరుణంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ , పరిశ్రమల ఆధారిత నైపుణ్య శిక్షణా కార్యక్రమాల ద్వారా తాము మా యువతను భవిష్యత్ అవకాశాల కోసం సిద్ధం చేస్తున్నామ‌ని తెలిపారు సీఎం. టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, తయారీ , వ్యవసాయ అనుబంధ రంగాలలో పెట్టుబడులు పెట్టవలసిందిగా పరిశ్రమల నాయకులకు ఆహ్వానం ప‌లికారు. ఉద్యోగాల కల్పన ,తెలంగాణ సుస్థిర వృద్ధిని సాధించడంలో ప్రభుత్వ పూర్తి మద్దతు ఉంటుందని వారికి హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి.

  • Related Posts

    మెటా ఇండియా ఎఫెక్ట్ ..డీజీపీ ఆఫీస్ కు డీసీపీ అటాచ్

    హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది మెటా ఇండియా హెడ్ పై హైద‌రాబాద్ పోలీసులు కేసు న‌మోదు చేయ‌డం. మెటా ఇండియా అధిపతిపై నమోదైన కేసులో నగర సైబర్ క్రైమ్ డీసీపీ కోసం గాలింపు ప్రారంభం అయ్యింది. ప్ర‌ధాన మంత్రి…

    హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు 5 అక్రిడిటేషన్

    హైద‌రాబాద్ : ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) నిర్వహించే ‘ఎయిర్‌పోర్ట్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అక్రిడిటేషన్ ప్రోగ్రామ్’ కింద ప్రతిష్టాత్మకమైన లెవెల్ 5 అక్రిడిటేషన్‌ను సాధించడం ద్వారా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక ప్రధాన అంతర్జాతీయ గుర్తింపును పొందింది. ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *