అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం రాష్ట్ర పరువును ,ఇమేజ్ ను దారుణంగా దెబ్బతీసిందన్నారు. కూటమి వచ్చాక మళ్లీ ఏపీ బ్రాండ్ ను పునరుద్ధరించాం. పెట్టుబడులు తీసుకువచ్చి పరిశ్రమల్ని ఏర్పాటు చేయిస్తున్నాం . కోర్టు కేసులు వేసి అడ్డుకున్నా మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు మళ్లీ పేపర్ లీక్ అంటూ కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. కోర్టు చీవాట్లు పెట్టినా… మళ్లీ ధర్నాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజలకు ఇబ్బందులు కల్పిస్తూ ప్రజలను వేధిస్తున్నారు… వీరు జెన్ జీ కాదు. గొడ్డలి జే అంటూ పేర్కొన్నారు సీఎం. అభివృద్ధిని అడ్డుకునేలా చేసే అరాచకాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించం. ప్రజల కోసం కఠిన చర్యలకు వెనుకాడం అని వార్నింగ్ ఇచ్చారు.
గంజాయి, బ్లేడ్ బ్యాచ్ లను నేరాలు, ఘోరాలు చేసే వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నారు.
యాక్సిడెంట్ చేస్తే గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లాలి… కానీ ఆధారాలు తారుమారు చేసేసి, వ్యక్తులను మార్చేసి కుట్రలు చేసి కేసు మాఫీ చేసేందుకు ప్రయత్నించారు. 44 ఏళ్ల వ్యక్తి చనిపోతే ఇబ్బందేమిటని మాట్లాడతారు. ఇదెక్కడి విడ్డూరం అని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు. పరామర్శల కోసం గంటల పాటు రోడ్లను నిర్బంధించేసి వెకిలి చేష్టలు చేస్తున్నారు. శాంతి భద్రతలను కాపాడే ఓ మహిళా పోలీసు అధికారి విషయంలో అసభ్యంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు .మహిళా పోలీసుల అధికారులను కూడా గొడ్డలి గ్యాంగ్ వేధిస్తోంది… ప్రజలు చైతన్యంతో వ్యవహరించాలి. రౌడీయిజం చేస్తూ రప్పా రప్పా అంటూ రోడ్డుపైకి వచ్చి అడ్డం పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.





