శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు

Spread the love

శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం

తిరుప‌తి : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు కొన‌సాగుతాయ‌ని తెలిపింది. ఈనెల 8, 15, 22, 29 తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. నవంబర్ 05వ తేదీన పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర కలశాభిషేకం, సాయంత్రం 5.30 గంటలకు స్వామివారు పుష్కరిణికి వేంచేపు చేస్తారు.
10న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం, సాయంత్రం 5.30 గం.లకు స్వామివారు పుష్కరిణికి వేంచేపు చేస్తారు.

20న ఉదయం 09.00 గం.లకు అమావాస్య, స‌హ‌స్ర‌ కలశాభిషేకం, రాత్రి 7.00 గం.లకు హనుమంత వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు. నవంబర్ నెలలో తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఆదివారం కైశిక ద్వాదశి ఆస్థానం చేప‌ట్టారు. 05న పౌర్ణమి గరుడసేవ
నవంబర్ 14, 21, 28 తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. 07న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధి స్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. 15న ఉత్తర నక్షత్రం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవింద రాజస్వామి వారు మాడ వీధులలో విహరిస్తారు.

నవంబర్ 26న శ్రావణం నక్షత్రం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు మాడ వీధులలో భక్తులను కటాక్షిస్తారు. ర్ 25 నుండి డిసెంబర్ 04 వరకు శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఉత్సవం ఉంటుంద‌ని టీటీడీ వెల్ల‌డించింది.

  • Related Posts

    ఉత్సాహంగా మహిళా ఉద్యోగుల పోటీలు

    Spread the love

    Spread the loveఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుపతి : టీటీడీ ఆధ్వ‌ర్యంలో మార్చి 9న నిర్వ‌హించ‌నున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా…

    వైభవంగా కుమార ధార తీర్థ ముక్కోటి

    Spread the love

    Spread the loveప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌కు అనుమ‌తి తిరుమల : తిరుమలలో కుమార ధార తీర్థ ముక్కోటి వైభవంగా నిర్వహించారు. చంద్ర గ్రహణం కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను తీర్థానికి అనుమతించారు. శ్రీవారి సేవకుల సహకారంతో టీటీడీ అన్న ప్రసాద విభాగం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *