29న రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివ‌స్

Spread the love

నిర్వ‌హంచాల‌ని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేప‌ట్టిన ఆనాటి తెలంగాణ వ‌చ్చుడో కేసీఆర్ స‌చ్చుడో పిలుపు వ‌ల్ల‌నే నూత‌న రాష్ట్రం సాధ్య‌మైంద‌న్నారు. అందుకే ప్ర‌తి ఏటా న‌వంబ‌ర్ 29వ తేదీన దీక్షా దివ‌స్ ను నిర్వ‌హిస్తూ వ‌స్తున్నామ‌న్నారు. శ‌నివారం పార్టీకి చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో టెలి కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు కేటీఆర్. ఈ సంద‌ర్భంగా దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివ‌స్ ను ఘ‌నంగా జ‌ర‌పాల‌ని పిలుపునిచ్చారు. ఈనెల 26న స‌న్నాహ‌క స‌మావేశాల‌ను ఆయా జిల్లా కేంద్రాల‌లో నిర్వహించాల‌ని ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను ఆహ్వానించాల‌ని అన్నారు కేటీఆర్.

నవంబర్ 29న జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని అన్ని జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లోనే నిర్వహించాలని స్ప‌ష్టం చేశారు. ఈ సందర్భంగా ఒక రోజు ముందుగా అంటే 28వ తేదీ సాయంత్రం లోగా జిల్లా కేంద్రాలు, పట్టణాలను బ్యానర్లు, ఫ్లెక్సీలతో అలంకరణ పూర్తి చేయాల‌న్నారు. పార్టీ కార్యాలయం ప్రాంగణాన్ని కూడా సుందరంగా అలంకరించాలని సూచించారు కేటీఆర్. జిల్లాలోని ముఖ్య నాయకులందరికీ ప్రత్యేకంగా సమాచారం అందించాల‌ని, కనీసం 1000 మంది కీలక పార్టీ నేతలతో ఈ సమావేశాన్ని నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. మొదటగా తెలంగాణ తల్లికి, అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన తర్వాత, కార్యక్రమం ప్రారంభానికి గుర్తుగా కెసిఆర్ భారీ కటౌట్‌కు పాలాభిషేకం చేయాలన్నారు.

దీక్షా దివస్ సందర్భంగా జరిగిన అనేక కీలక సంఘటనలు, వార్తలు, పరిణామాల సమాహారంతో కూడిన ఫోటో ప్రదర్శనను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు కేటీఆర్. కేవలం రాజకీయ ఉపన్యాసాలు కాకుండా ఆనాటి ఉద్యమ స్మృతులను, ముఖ్యంగా దీక్షా దివస్ వివరాలను అందించేలా మాట్లాడే వక్తలను ఆహ్వానించాలని, వారి సమయాన్ని ఇప్పుడే నిర్ధారించుకోవాలని కేటీఆర్ సూచించారు.

  • Related Posts

    ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆట‌లు ఇక్క‌డ సాగ‌వు

    Spread the love

    Spread the loveస్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పొన్నం ప్ర‌భాక‌ర్ హైద‌రాబాద్ : మ‌రోసారి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌కు చెందిన మేధావులు, ప్ర‌జాస్వామిక‌వాదులు, క‌ళాకారులు, క‌వులు, అమ‌రవీరుల కుటుంబాలు, జ‌ర్న‌లిస్టులు సైతం భ‌గ్గుమంటున్నారు.…

    మ‌య‌న్మార్ అధ్య‌క్షుడితో పీఎం మోదీ భేటీ

    Spread the love

    Spread the loveప్రధానమంత్రి హైదరాబాద్ హౌస్‌లో మీటింగ్ న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లాయింగ్ సోమవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఒకరినొకరు పలకరించుకుని కరచాలనం చేసుకున్నారు. ఒక అధికారిక కార్యక్రమంలో భాగంగా భారత, మయన్మార్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *