29న రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివ‌స్

Spread the love

నిర్వ‌హంచాల‌ని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేప‌ట్టిన ఆనాటి తెలంగాణ వ‌చ్చుడో కేసీఆర్ స‌చ్చుడో పిలుపు వ‌ల్ల‌నే నూత‌న రాష్ట్రం సాధ్య‌మైంద‌న్నారు. అందుకే ప్ర‌తి ఏటా న‌వంబ‌ర్ 29వ తేదీన దీక్షా దివ‌స్ ను నిర్వ‌హిస్తూ వ‌స్తున్నామ‌న్నారు. శ‌నివారం పార్టీకి చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో టెలి కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు కేటీఆర్. ఈ సంద‌ర్భంగా దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివ‌స్ ను ఘ‌నంగా జ‌ర‌పాల‌ని పిలుపునిచ్చారు. ఈనెల 26న స‌న్నాహ‌క స‌మావేశాల‌ను ఆయా జిల్లా కేంద్రాల‌లో నిర్వహించాల‌ని ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను ఆహ్వానించాల‌ని అన్నారు కేటీఆర్.

నవంబర్ 29న జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని అన్ని జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లోనే నిర్వహించాలని స్ప‌ష్టం చేశారు. ఈ సందర్భంగా ఒక రోజు ముందుగా అంటే 28వ తేదీ సాయంత్రం లోగా జిల్లా కేంద్రాలు, పట్టణాలను బ్యానర్లు, ఫ్లెక్సీలతో అలంకరణ పూర్తి చేయాల‌న్నారు. పార్టీ కార్యాలయం ప్రాంగణాన్ని కూడా సుందరంగా అలంకరించాలని సూచించారు కేటీఆర్. జిల్లాలోని ముఖ్య నాయకులందరికీ ప్రత్యేకంగా సమాచారం అందించాల‌ని, కనీసం 1000 మంది కీలక పార్టీ నేతలతో ఈ సమావేశాన్ని నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. మొదటగా తెలంగాణ తల్లికి, అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన తర్వాత, కార్యక్రమం ప్రారంభానికి గుర్తుగా కెసిఆర్ భారీ కటౌట్‌కు పాలాభిషేకం చేయాలన్నారు.

దీక్షా దివస్ సందర్భంగా జరిగిన అనేక కీలక సంఘటనలు, వార్తలు, పరిణామాల సమాహారంతో కూడిన ఫోటో ప్రదర్శనను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు కేటీఆర్. కేవలం రాజకీయ ఉపన్యాసాలు కాకుండా ఆనాటి ఉద్యమ స్మృతులను, ముఖ్యంగా దీక్షా దివస్ వివరాలను అందించేలా మాట్లాడే వక్తలను ఆహ్వానించాలని, వారి సమయాన్ని ఇప్పుడే నిర్ధారించుకోవాలని కేటీఆర్ సూచించారు.

  • Related Posts

    శంషాబాద్ లో రెండో టెర్మిన‌ల్ పూర్తి చేయాలి

    Spread the love

    Spread the loveలోక్ స‌భ‌లో ఎంపీ ర‌ఘునంద‌న్ రావు న్యూఢిల్లీ : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ ర‌ఘునంద‌న్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు లోక్ స‌భ సాక్షిగా. జీరో అవ‌ర్ లో ఆయ‌న ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. భాగ్యనగరం లో…

    రూ. 167.20 కోట్లకు అమ్ముడు పోయిన పెయింటింగ్

    Spread the love

    Spread the loveభార‌తీయ క‌ళా రంగంలో అరుదైన రికార్డ్ న‌మోదు న్యూఢిల్లీ : భార‌తీయ క‌ళా రంగంలో అరుదైన ఘ‌న‌త చోటు చేసుకుంది. ప్ర‌ముఖ చిత్ర‌కారుడు, దివంగ‌త రాజా ర‌వివ‌ర్మ గీసిన పెయింటింగ్ ఏకంగా రూ. 167.20 కోట్లకు అమ్ముడ పోయింది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *