విద్యార్థులే స‌త్య‌సాయి బాబాకు బ్రాండ్ అంబాసిడ‌ర్లు

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఉప రాష్ట్ర‌ప‌తి సీపీ రాధాకృష్ణ‌న్

శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌పర్తి జిల్లా : భ‌గ‌వాన్ శ్రీ సత్యసాయి బాబా సూత్రాలను దేశ విదేశాలకు తీసుకెళ్లడానికి ఇక్కడ చదువుకున్న విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు అని అన్నారు ఉప రాష్ట్ర‌ప‌తి సీపీ రాధాకృష్ణ‌న్. మన కోసం మనం బతకడంతో పాటు ఇతరుల గురించి బతకడమనేది ఉత్తమ విధానం అన్నారు. ఈ ఆధునిక విధానాలను ప్ర‌తి ఒక్క‌రు పాటించాల‌ని సూచించారు. సంప్రదాయాలను పాటించాలి. సత్యసాయి బాబా సిద్దాంతాలు.. సూత్రాలే నిజమైన విద్య అని అన్నారు. ప్రపంచం చెప్పేది భారత దేశం వింటోందనేది పాత మాట భారత దేశం చెప్పేది ప్రపంచం వింటోందనేది కొత్త మాట అని అన్నారు ఉప రాష్ట్ర‌ప‌తి. దేశాన్ని ఈ స్థాయికి తీసుకెళ్లడంలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర కీలకమైనదని చెప్పారు. రీసెర్చ్ రంగానికి ఎక్కువ నిధులు వినియోగించాలని కోరారు. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.

కోవిడ్ కు టీకాలను కనుగొంది మన భారత దేశమే. దీన్ని మన దేశంతో పాటు వివిధ దేశాలకు ఫ్రీగా ఇవ్వడమనేది నరేంద్ర మోదీ అచీవ్మెంట్. కోవిడ్ టీకాలను 100కు పైగా దేశాలకు పంపిణీ చేశారు. అందుకే ఓ దేశాధ్యక్షుడే మోదీ పాదాలకు నమస్కరించారని అన్నారు. భారత మాత శక్తిమంతమైనదే కాదు… దయగలిగినది కూడా. దయతో లేకుంటే ఎంత శక్తి ఉన్నా నిరర్థకమేన‌ని అన్నారు సీపీ రాధాకృష్ణ‌న్. కొన్ని విదేశాల్లో కూడా టీకాలు తయారు చేశారు. కానీ వారు 7500 డాలర్లకు అమ్మాలని భావించారు. ప్రధాని మోదీ ఏనాడూ కోవిడ్ టీకాలను అమ్మాలని అనుకోలేదని అన్నారు. అందుకే ప్రధాని మోదీ ఇవాళ గ్లోబల్ లీడర్ గా ఎదిగారని కొనియాడారు. డ్రగ్స్ ఇప్పుడు అతి పెద్ద సవాలుగా మారింది… నో టూ డ్రగ్స్ అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని పిలుపునిచ్చారు ఉప రాష్ట్ర‌ప‌తి.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *