రేపే టీటీడీ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

భ‌క్తుల ప్ర‌శ్న‌ల‌కు సింఘాల్ స‌మాధానం

తిరుమల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ్రీ‌వారి భ‌క్తుల‌కు సంబంధించి ప్ర‌తి నెలా నిర్వ‌హించే డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం డిసెంబర్ 5వ తేదీన నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇందులో భాగంగా శుక్ర‌వారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో జరుగనుందని స్ప‌ష్టం చేసింది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుందని పేర్కొంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చని స్ప‌ష్టం చేసింది. ఇందుకు భక్తుల 0877-2263261లో సంప్ర‌దించాల‌ని కోరింది. ఇదిలా ఉండ‌గా టీటీడీ గ‌త కొన్నేళ్లుగా ఈ అరుదైన డ‌య‌ల్ యువ‌ర్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తూ వ‌స్తోంది. భ‌క్తులు చెప్పే ప్ర‌తి మాట‌ను, ఇచ్చే సూచ‌న‌ల‌ను తీసుకునేందుకు డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మాన్ని నిర్వహించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *